ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం సంభవించింది. అస్ట్రేలియాలోని ని మెల్బోర్న్ నగరంలోని ఫ్లిండర్స్ అండ్ ఎలిజబెత్ వీధిలో.. రహదారిపై నుంచి వేగంగా వెళ్తున్న ఓ కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. వేగనియంత్రణ కోల్పోవడంతో.. అదుపు తప్పి ఏకంగా సైడ్ వాక్ లో నడుస్తున్న జనాలపైకి దూసుకెళ్లడంతో సుమారుగా 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారి గాయాలు, హాహాకారాలతో అక్కడంతా విషాధ వాతావరణం అలుముకుంది.
కాగా ఇది ఉగ్ర చర్యేనని భావించిన అక్కడున్నవారంతా భయకంపితులయ్యారు. అయితే కేవలం యాధృచ్ఛీకంగానే జరిగిన ఘటనని పోలీసులు తేల్చారు. కారును మతిస్థిమితం సరిగా లేని మత్తుమందు సేవించిన వ్యక్తులు నడిపారని దీంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా కారు ప్రమాదంలో క్షతగాతులైన వారని ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మెట్రో ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కారు తమపైకి దూసుకువస్తుండడంతో జనం అంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.
తెలుపు రంగు సుజుకీ ఎస్యూవీలో ఇద్దరు వ్యక్తులు ముందు సీటులో కూర్చున్నారని, ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ దూసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతవాసులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఏడాది మొదట్లో మెల్బోర్న్లోని రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్ వద్ద కారు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. అదే మెల్బోర్న్లో మళ్లీ ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్ర చర్యా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more