వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఓ వైపు రాహుల్ తన సభలు సమావేశాలతో క్షణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్డు మధ్య గడిపేస్తుంటే.. ఇక ఆయనకు మద్దత్తుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇవాల కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. గుజరాత్ పర్యటనలో వున్న ఆయన ఇవాళ అక్కడి వ్యాపారస్థులు, వాణిజ్యవేత్తలతో సమావేశం కానున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైపైల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు గా చెప్పుకుంటున్న జీఎస్టీ అమలు, నోట్ల రద్దు దేశ అర్థిక సంస్కరణలు ఎంతమాత్రం కావని ఆయన తేల్చిచెప్పారు. కాగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతంలా పరిణిమించాయని.. ఇవి భారత వ్యవస్థ ను తీవ్ర విపత్తులోకి తీసుకెళ్లాయని దుయ్యబట్టారు. ఈ రెండూ మోదీ చేసిన అతిపెద్ద తప్పులని, ఇప్పటికైనా, మోదీ తన తప్పును అంగీకరించాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.
మోదీ నిర్ణయాలు భారత వ్యవస్థకు విపత్తులను తెచ్చి పెట్టాయని, ఇండియా వంటి దేశంలో తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయన్న విషయం మోదీ అమలులోకి తెచ్చిన నోట్లరద్దు, జీఎస్టీతో బహిర్గతమైందని ఆరోపించారు. ఈ రెండు నిర్ణయాలు దేశ అర్థిక వ్యవస్థపైనే కాకుండా అనేక అంశాలకు విపత్తును అపాదించి పెట్టాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయాలతో దేశం అర్థిక, సామాజిక, పరపతి, పేరు, వ్యవస్థపరంగా నష్టపర్చిందని ఆయన అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ తప్పుడు నిర్ణయాల ప్రభావం దేశంలోని బడుగు వర్గాలపై భారీగా పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ. తాను చేసిన అతిపెద్ద తప్పును దేశ ప్రజలకు ఎదుట అంగీకరించి, భారత వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేయాలని, లేకుంటే, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. నోట్ల రద్దు అన్నది సంస్థాపరంగా జరిగిని లూటీ అని, చట్టబద్దంగా జరిగిన తప్పని ఆయన మండిపడ్డారు. గుజరాత్ లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more