ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని స్పష్టంగా చెప్పాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. చెయ్యాలనుకున్నది చెప్పడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై విస్పష్ట ప్రకటన చేసేందుకు రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏంటని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదాపై ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేదని ఆయన తెలిపారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కోసం సెమినార్ నిర్వహించాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను చెప్పిన పనులు చేయాలని ప్రభుత్వంపై ఎన్నడూ ఒత్తిడి చేయలేదని ఆయన తెలిపారు.
తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని ఆయన చెప్పారు. తాను పేదల కోసం పని చేస్తున్నానని ఆయన చెప్పారు. తనకు ఏ పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం లేదని ఆయన అన్నారు. జనసేన నిర్మాణం ఇంకా జరుగుతోందని ఆయన అన్నారు. 25 ఏళ్ల పాటు సమాజం కోసం, పార్టీ తరపున కష్టపడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, తన లక్ష్యం కేవలం ఎన్నికల్లో సీట్లు గెలవడం మాత్రమే కాదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ విఫలమైన నేపథ్యంలో ప్రతి విషయంలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తనపైన ఉందని ఆయన చెప్పారు. 2018 చివరి నాటికి తన బలాబలాలపై ఒక అంచనా వస్తుందని ఆయన అన్నారు.
ఇక్కడ కూర్చుని బలాబలాలను చెప్పడం సహేతుకం కాదని ఆయన అన్నారు. తాను ఊహల్లో ఉండనని, వాస్తవంగా ఆలోచిస్తానని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.విజయం సాధించని పక్షంలో పోటీ చేసి ఉపయోగం ఉంటుందా? అని ఆయన అడిగారు. అధికారం వస్తుందా? అసెంబ్లీకి వెళ్తామా? అన్నది ప్రశ్న కాదని, పని చేసుకుంటూ పోతే వచ్చేవి ఎలాగూ వస్తాయని ఆయన చెప్పారు. తాను ఒక ప్రాంతం, ఒక భాషకు పరిమితం కాదని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీని విస్తరించాలని ఆయన అన్నారు. శతఘ్ని పేరుతో డిజిటల్ టీమ్ ను ఆయన తయారు చేస్తున్నారు.
తాను తెలంగాణలోనే పెరిగానని ఆయన చెప్పారు. తెలంగాణలోని జిల్లాల్లో యువత సమస్యపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తనకు అనిపించలేదని, ఇంకా నేతల వెనుక, వారికి సపోర్టుగా ఉన్నట్టు అనిపిస్తోందని, వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే కత్తి మహేష్ వివాదంపై పట్టించుకోకపోవటమే అన్న రీతిలో ఆయన మాట్లాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more