కాకినాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలలో ఓటింగ్ మందకొడిగా సాగుతుంది. స్థానిక ఎన్నికలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో అసక్తి కనబర్చేందుకు బదులు.. అంతగా ఉత్సాహం కనబర్చకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతుందన్న అందోళన అన్ని పార్టీల అభ్యర్థులలో వ్యక్తంమవుతుంది. దీంతో ఓటింగ్ ప్రారంభమైన రెండున్నర గంటల వరకు కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
ఇదిలావుండగా నంద్యాల అసెంబ్లీ సీటు తరహాలో ఏమి చేసైనా.. కాకినాడ నగరపాలక సంస్థపై తమ జెండాను ఎగురవేయాలని పట్టుదలతో వున్న కేంద్రరాష్ట్రాలలోని అధికార పక్షం.. నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడతుందని ప్రతిపక్ష సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఫిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే స్లిప్పులు పంపిణీ చేయడాన్ని పోలీసులు అడ్గుకోగా, వారితో ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు.
ఏకంగా పోలింగ్ బూత్ లోనికి వెళ్లి ఓటు వేయడానికి వచ్చని ఓటర్లును ప్రలోభాలకు గురిచేసి మరీ తమకు అనుకూలంగా ఓటువేయించుకన్నారని, ఇక మరికోందరిని భయాందోళనకు గురిచేసి మరీ ఓట్లు వేయించుకున్నారని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఎమ్మెల్యే వర్మ చర్యలను చూస్తూ నిశ్చేష్టులై నిల్చుండిపోయారని ప్రతిపక్ష నేతలు పేర్కోన్నారు. అధికారం మాటున టీడీపీకి చెందిన అభ్యర్థులతో పాటు బీజేపి అభ్యర్థులు కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న అరోపించారు.
14వ వార్డు ఏటిమొగ్గలో డివిజన్ టీడీపీ అభ్యర్థి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తుండగా, వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు 4వ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి దిగారు. పోలింగ్ బూత్ నం.4/2లో ఆమె ప్రచారం చేస్తున్నా పోలీసులు ఏమాత్రం అమెను ప్రచారాన్ని చూసి కూడా పట్టించుకోలేదని, అయితే అప్పుడే మీడియా ఎంటర్ కావడంతో అమెను పోలీసులు అక్కడి నుంచి పంపించారని వైసీసీ నేతలు అరోపించారు.
ఇక 19వ వార్డు నుంచి పోటీచేస్తున్న బీజేపి అభ్యర్థి పోలింగ్ బూత్ లోనే ఓటర్లకు డబ్బులు పంఫిణీ చేస్తున్నారన్న వార్తలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ అరోపణల నేపథ్యంలో బీజేపి అభ్యర్థిని నిలవరించేందుకు వైసీసీ పార్టీ శ్రేుణులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము పిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో వరిన పోలీసులు చెదరగొట్టారు. ఇక నగరపాలక సంస్థ ఎన్నికలలో నోటా బటన్ వుండదని, అది కేవలం పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు మాత్రమే వుంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more