అమ్మ మృతిపై క్విజ్.. ఆన్సర్ చెబితే క్యాష్ ప్రైజ్ | Ex CM Announces Cash Prize on Amma's Mystery Death

Ops offers rs 10k on jayalalitha death mystery

O Panneerselvam, OPS Jayalalithaa Death, Amma Death Mystery Bumper Offer, Jaya's Death, Palaniswami Jayalalithaa Death, Jayalalithaa's Death

O Panneerselvam offers Rs 10000 for response from TN govt on Jayalalithaa's Death. OPS offers Rs 10K to anyone who can get reply from Palaniswami on Jaya's death.

మాజీ సీఎం బంఫరాఫర్.. 10వేల నజరానా!

Posted: 07/17/2017 12:22 PM IST
Ops offers rs 10k on jayalalitha death mystery

జయలలిత మరణం అనారోగ్యంతోనే నాటకీయ పరిణామాల మధ్యే ఆమెకు చికిత్స కొనసాగటం పలు అనుమానాలకు తావినిచ్చింది. ప్రతిపక్ష డీఎంకేతోపాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా అమ్మ మృతిని తమ లాభం కోసం వాడుకోవాలనే చూస్తున్నారు. విధేయుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడు.

అయితే జయ మృతిపై ప్రస్తుతం సీఎంగా ఉన్న పళని స్వామిని నిలదీసే వారికి నజరానా ప్రకటించాడు ఓపీఎస్. జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపిస్తారా? లేదా? అన్న విషయంపై పళనిని ప్రశ్నించి, సమాధానం రాబట్టిన వారికి రూ.10వేలు ఇస్తానంటూ పేర్కొన్నాడు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పన్నీర్ సెల్వం ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మ మృతిపై అనుమానాలు తీరే వరకు తాము పోరాడుతూనే ఉంటామని, ఇదొక ‘ధర్మయుద్ధం’ అంటూ అభివర్ణించాడు.

పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ కూడా తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని, అలాంటిది శశికళ మాత్రం తన 16 మంది కుటుంబ సభ్యులను పార్టీలో ఇరికించాలని చూస్తోందంటూ విమర్శించాడు. శశికళ సహా వారిందరినీ జయలలిత ఎప్పుడో బహిష్కరించారని, అయితే క్షమాపణలు చెప్పి మళ్లీ జయ చెంతకు చేరారని విమర్శించాడు. మన్నార్ గుడి మాఫియా ద్వారా మళ్లీ పార్టీపై పట్టుపెంచుకోవాలని చూస్తే అది అత్యాశే అవుతుందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Panneerselvam  Jayalalithaa Death  CM Palani Swami  

Other Articles