అక్రమ భూ దందాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆరని చిచ్చునే రగిల్చాయి. వ్యవహారంలో ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలే ఉండటం, పైగా ఏపీ ఎమ్మెల్సీ ఇక్కడ హైదరాబాద్ లో భూ ఆక్రమణలు చేయటం, సబ్ రిజిస్ట్రార్ల కక్కుర్తితో వేల కోట్ల ప్రభుత్వ భూములు భూ బకాసురులకు అన్యాక్రాంతం చేయటం, అత్యన్నత స్థాయి విచారణకు ప్రతిపక్షాల డిమాండ్ ఇలా సాగుతూ వస్తోంది వ్యవహారం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం విచారణ పేరిట ఓ అడుగు ముందుకేసినప్పటికీ, చిన్న చిన్న ఆరోపణలనే సీరియస్ గా తీసుకునే కేసీఆర్ మాత్రం వివరణలతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగాడు. ఈ వ్యవహారంలో ప్రముఖంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న గోల్డ్స్టోన్ కంపెనీ, దాని యాజమాని ప్రసాద్ను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటంపై ప్రశ్నలు గుప్పించాడు. విచారణకు ఆదేశించకుండా స్టేట్ మెంట్లు ఇస్తూ కాలాయాపన చేస్తున్నాడని విమర్శించాడు. ఒక్క గజం భూమి, ఒక్క పైసా పోలేదని సీఎం ఎలా నిర్ధారణకు వచ్చారని ప్రశ్నించాడు.
ఇంత పెద్ద అక్రమ వ్యవహారంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే, మతపర రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్న నాగం ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డాడు. ప్రధాని మోదీ రిజర్వేషన్లకు ఒప్పుకున్నాడంటూ అబద్ధపు స్టేట్ మెంట్లు ఇస్తూనే.. మరోవైపు ఒప్పుకోకపోతే పోరాటం చేస్తామంటూ స్టేట్ మెంట్లతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more