అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతన్న తరుణంలోనే మరో విషాదం వెన్నాడింది. ఆమె మేనల్లుడు టీవీ మహదేవన్ ( 47) ఆకస్మికంగా మరణించాడు. కుంభకోణంలో ఇవాళ ఉదయం తంజావూరులోని మహాలింగేశ్వర ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహదేవన్ గుండెపోటుకు గురైయ్యారు. తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన అలయంలోనే కుప్పలేలిపోయి మరణించారు. ఈ వార్త బెంగళూరులోని పరప్పనా అగ్రహార కారాగారంలో వున్న శశికళను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మేనల్లుడి ఆకస్మిక మరణంతో కన్నీరు మున్నీరయ్యారు.
తంజావూరులోని మహాలింగేశ్వర ఆలయానికి వెళ్లిన మహదేవన్.. గర్భగుడి ఎదురుగా పూజల అనంతరం బయటికి వస్తుండగా ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమీపంలోని ప్రైవేటు అస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతదేహాన్ని అస్పత్రికి కాకుండా నేరుగా ఆయన ఇంటికి తరలిచారు. కాగా మహదేవన్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు మేనల్లుడి మహదేవన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శశికళ పెరోల్కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
శశికళ పెద్ద ఆనయ్య డా.వినోదగన్ కొడుకు మహాదేవన్ తంజావూరులో స్థిరపడ్డారు. తంజావూరులో తండ్రి డా. వినోదన్ ఆధ్వర్వంలో స్థాపించిన వినోదగన్ అసుపత్రికి మహదేవన్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ఫోరమ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. శశికళతో అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన, అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో శశికళ వెంటే వుంటూ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారీపోకుండా కీలకంగా వ్యవహరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more