ముంబై పోలీసులు ప్రస్తుతం ఓ గుజరాత్ వ్యాపారవేత్త కోసం తెగ గాలింపు చర్యలు చేపట్టారు. 40 ఏళ్ల ఓ గృహిణికి మత్తు మందిచ్చి మరీ అత్యాచారం చేయటమే అందుకు కారణం. అందుకోసం అతగాడు వాడుకున్న ఆయుధం సోషల్ మీడియా.
గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఫేస్ బుక్ లో ముంబై అలీ బాగ్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై నెమ్మదిగా ఫోన్ నంబర్లు మార్చుకున్న ఆ ఇద్దరి ఫ్రెండ్ షిప్ బాగా ముదిరిపోయింది. బాగా నమ్మకం కుదిరాక ఒకసారి కలుద్దామని ఆమెను ఆహ్వానించాడు. ఇంతలో ఓ రోజు బిజినెస్ పని మీద తాను ముంబైకి వచ్చానని, వచ్చి కలవమని ఆమెను ఆహ్వానించాడు.
ఆపై గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద కలుసుకున్న తర్వాత బాంద్రాలోని ఓ స్టార్ హోటల్ లో కాఫీ తాగుదామని తీసుకెళ్లాడు. అప్పటికే తాను బుక్ చేసి ఉంచిన రూంకి తీసుకెళ్లిన అతను ముందు మంచినీళ్లు ఇచ్చాడు. అయితే అప్పటికే అందులో మత్తుమందు కలిపి ఉండటంతో ఆమె స్పృహ కోల్పోయింది. అచేతనంగా పడి ఉన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ వ్యాపారవేత్త. ఆపై మెలుకువ వచ్చిన ఆమె జరిగిన దారుణం గురించి తన భర్తకు వివరించింది.
భర్త ఆ నిందితుడికి ఫోన్ చేసి గొడవపడటంతోపాటు స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాడు. అయితే అప్పటికే అతను వచ్చిన పని సక్సెస్ ఫుల్ గా పూర్తి కావటంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అపరిచితులతో సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more