యూపీలో ఘోర రైలు ప్రమాదం.. ఉగ్రవాదుల పనేనా? | Eight coaches of Mahakaushal express train derail.

Mahakoshal express derail in kulpahar

Mahakoshal Express, Mahakoshal Express Accident, Uttar Pradesh Train Derail, Kulpahar Train Accident, Train Derail India, Mahakoshal Express Mishap, Mahoba Town,

Eight coaches of Jabalpur-Mahakoshal Express derail in Uttar Pradesh Kulpahar, rescue operations on. At least 12 People injured.

ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం

Posted: 03/30/2017 07:41 AM IST
Mahakoshal express derail in kulpahar

మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్ లోని జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) వద్ద గురువారం ఉదయం మహాకోశల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) వెళ్తున్న రైలు గురువారం తెల్లవారుజామున మహోబా మరియు కుల్ పహార్ మధ్య పట్టాలు తప్పింది. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోవటంతో ఈ ఘోరం జరిగింది. అయితే ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియటం లేదు.

అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు ఏసీ, నాలుగు స్లీపర్ తోసహా మొత్తం 8 బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 18 మంది గాయపడగా, అందులో ఆరుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ సమీపంలోని మహోబా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

కాగా, ఘటన గురించి తెలియగానే మంత్రి సురేష్ ప్రభు ఘటనా స్థలానికి బయలుదేరారు. ఆ మధ్య జరిగిన రైలు ప్రమాదాల విషయంలో ఉగ్ర హస్తం కోణం వెలుగు చూడటంతో ప్రస్తుత ఘటనపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ, గ్వాలియర్, బందా స్టేషన్ లలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Mahakoshal Express Derail  Train Accident  

Other Articles