డీమానిటైజేషన్ (పాత పెద్దనోట్ట రద్దు) నేపథ్యంలో దాని ప్రతిఫలాలు త్వరలోనే దేశ ప్రజలకు అందిస్తామని అప్పటి వరకు వేచి వుండాలని ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు కూడా వరుస పెట్టి చెప్పారు. ఇది చాలదన్నట్లు ఇక సోషల్ మీడియాలో అయితే బీజేపి అనుకూలవర్గాలు, అనుబంధ సంస్థలు మరో అడుగు ముందుకేసి పాత పెద్దనోట్ల రద్దు తరువాత ఏం జరుగుతుంది అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపాయి.
ప్రస్తుత లీటరు ధరతో కొన్న రోజుల్లోనే రెండు లీటర్ల పెట్రోల్ వస్తుందని, ఇక గ్యాస్ సిలిండర్ ధర అమాంతంగా సబ్సీడీ ధర కన్నా తక్కువకు చేరకుంటుందని ఊదరగోడుతూ సామాజిక మాధ్యమాలలో భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. సగటు భారతీయుడు మాత్రం ఇవన్నీ జరగాలని అకాంక్షించాడు. నోట్ల రద్దు నేపథ్యంలో తాను అనేక కష్టనష్టాలకు ఓర్చి.. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మౌనంగా వున్నాడు.
అయితే డీమానిటైజేషన్ జరిగి నాలుగు మాసాలు పూర్తికావస్తుంది. కానీ ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో నోట్ల కష్టాలకు బ్రేకులు పడలేదు. వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇంకా ప్రజలను ఈ కష్టాలు వెంటాడుతున్నాయి. మునుపటి పరిస్థితికి చేరుకువడానికి ఇంకెంత కాలం పడుతుందన్న విషయాన్ని పక్కనబెడితే.. తాజాగా అనేక ఏటీయం కేంద్రాలలో నకిలీ నోట్లు, బొమ్మ నోట్లు, గాంధీ ముద్రలేని నోట్లు, సీరియల్ నెంబర్లు లేని నోట్లు దర్శనమిస్తూ ప్రజలను సరికొత్త కష్టాలకు గురిచేస్తున్నాయి.
ఈ విషయాలను పక్కనబెడితే.. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర చెప్పిన మాటలకు, చేసిన ప్రచారానికి.. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు మధ్య అసలు పొంతన లేకుండా పోతుంది. ధరలు తగ్గుతాయని అశించిన ప్రజలపై ధరాఘాతం పోటు పడుతుంది. అటు పలు పర్యాయాలు ఇంధన ధరలును పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా సబ్సీడీరహిత వంటగ్యాస్ సిలిండర్ల ధరను కూడా అమాంతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపింది.
నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ గ్యాస్ ధరను రూ. 86 మేరకు పెంచుతున్నట్టు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల సబ్సిడీతో సిలిండర్లు పొందుతున్న పేదలపై ఎలాంటి ప్రభావమూ ఉండదని పేర్కొంది. కాగా, ఈ మార్పుతో ఢిల్లీలో సబ్సిడీ రహిత సిలిండర్ ధర రూ. ఏడు వందల ముఫై ఏడు కానుంది. సబ్సిడీతో కూడిన సిలిండర్ ధర రూ. నాలుగు వందల ముఫై నాలుగుగా ఉండనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more