ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన తల్లి సోనియాగాంధీ అేకుండా దాదాపుగా ఇరువై ఎనమిదేళ్ల తరువాత ఆయన తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బెరేలి లోక్ సభ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాయ్బరేలీలోని ఛాటో గ్రామంలో ఓ ఎన్నికల సభకు ఆయన హాజరై ప్రసంగించారు. అయితే తన తల్లి లేకపోయినా ఆయన రాయ్ బరేలీలోని తల్లుల అశీర్వాదం మాత్రం మెండుగా లభించింది.
అదెలా అంటారా..? ఏ ఎన్నికల సభను తీసుకున్నా అక్కడ అధికంగా పురుషులు మాత్రమే కనిపిస్తారు. కానీ రాహుల్ సభకు మాత్రం అధిక సంఖ్యలో మహిళలే తరలివచ్చారు. ఇంత మంది మహిళలు సభకు హాజరు కావడంతో రాహుల్ లో ఉత్సాహం ఉప్పొంగింది. దీంతో ఇది పూర్తిగా మహిళా మద్దతుదారుల సభగా కనిపించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోగానీ, బహిరంగ సభలలో గానీ ఇలా ఎక్కువగా మహిళలే కనిపించడం చాలా అరుదు. దీంతో ఈ విషయాన్ని రాహుల్ సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు.
'తొలిసారి ఒక ఎన్నికల ర్యాలీకి మహిళలు అత్యధికంగా తరలిరావడం చూస్తున్నాను. మీరు అత్యధికంగా వచ్చి పురుషులను పక్కకు తప్పుకొనేలా చేశారు' అని ఆయన పేర్కొన్నారు. సభకు వచ్చిన వారి కెరింతల మధ్య.. ప్రధాని మోదీ చెప్పినట్టు మీ బ్యాంకు ఖాతాలోకి రూ. 15 లక్షల చొప్పున వచ్చాయా? అని ప్రశ్నించారు. కేవలం సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. తన తల్లి నియోజకవర్గమైన రాయ్బరేలీలో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాహుల్గాంధీ ప్రయత్నించారు.
మరోవైపు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లిద్దరూ కలసి హాజరుకావాల్సిన అహ్మదాబాద్ బహిరంగసభలో అపశృతి చోటుచేసుకుంది. సభా వేదిక ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారి కుటుంబభద్రత కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే పలువురు కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో రాహుల్, అఖిలేష్ యాదవ్ లిద్దరూ వేదక వద్దకు ఇంకా చేరుకోకపోవడంతో పెనుముప్పు తప్పినట్లైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more