మండపంలోనే మందుకొట్టి, భోజనాల దగ్గర వీరంగం సృష్టించిన వరుడికి తగిన బుద్ధిచెప్పింది ఓ వధువు. స్నేహితులతో కలసి వధువు కుటుంబసభ్యులతో, అక్కడి వంటవారితో గోడవపడి నానా రభస సృష్టించిన వరుడితో పెళ్లిని రద్దు చేసుకుంది వధువు. పోలీసులు నచ్చజెప్పేనా వినకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. చైన్నైలోని చిదంబరంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై చిదంబరం టౌన్ పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చిదంబరం శివారు కిళ్లయైకి చెందిన ధర్మరాజన్(28)కు అక్కడికి సమీపంగా నివసించే యువతితో పెళ్లి సంబంధం కుదిరింది.
ఓ కల్యాణ మండపంలో, ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో ఆదివారం నిశ్చితార్థం జరిగింది. వేడుకలో భాగంగా భారీ విందును కూడా ఏర్పాటుచేశారు. అంతా సంతోషంలో మునిగితేలుతున్నవేళ.. మండపంలోని ఓ గదిలో వరుడు ధర్మరాజన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. చాలాసేపటి తర్వాత గదిలో నుంచి బయటికి వచ్చిన వరుడు దోస్తులతో కలిసి భోజనశాలవైపునకు వెళ్లాడు. అంచనాలకు మించిన సంఖ్యలో వరుడి స్నేహితులు రావడంతో ఆహారపదార్థాలు అందరికీ అందలేదు. దీనిని అవమానంగా భావించిన వరుడు వంటవాళ్లపై దాడిచేసి నానా రభస చేశాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదంతా గమనించిన వధువు నిశ్చితార్థాన్ని రద్దుచేయాలని తల్లిదండ్రులను కోరింది.
కాగా, ఏమాత్రం వెనక్కి తగ్గని వరుడు ధర్మరాజన్.. చిదంబరం పోలీస్ స్టేషన్కు వెళ్లి వధువు కుటుంబసభ్యులపై ఫిర్యాదుచేశాడు. ‘ఆ అమ్మాయిని నాకే ఇచ్చి పెళ్లిచేయండి’అని వేడుకున్నాడు. దీంతో పోలీసులు ఇరుపక్షాలను పిలిపించి సమస్యను పరిష్కరించే ప్రయత్నంచేశారు. కానీ తాగుబోతు వ్యక్తిని చచ్చినా పెళ్లి చేసుకోనని వధువు భీష్మించింది. అలా నిశ్చితార్థాన్ని రద్దుచేసుకుని యువతి కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. చివరికి చేసేదేమీలేక పోలీసులు వరుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more