టీవీ, పేపర్, ఫేస్ బుక్, ట్విట్టర్ పేరు ఏదైనా వాటికుండే కామన్ నేమ్ మాత్రం మీడియానే. వార్తలను వేగంగా తెలుసుకునేందుకు జనాలు వీటిని వాడుకోవాలని చూస్తుంటే.. హిట్స్ కోసమే అవి మాత్రం పుకార్లను వాడేసుకుంటున్నాయి. ఓ వారం క్రితం వాట్సాఫ్ లో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇంతకు ముందుకు పిల్లి మాంసంతో బిర్యానీ వండినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కుక్క మాంసంతో వండుతున్నారని, వాటికి సంబంధించిన ఫోటోలు, కొన్ని ఫేమస్ బిర్యానీ హౌస్ ల పేర్లను అందులో చేర్చారు. ఇక అవి పట్టుకుని కొన్ని ఛానెళ్లయితే క్రియేటివిటీతో వీడియోలు, కథనాలు చేసి అవి మనదగ్గరే అంటూ ఓ ప్రముఖ హోటల్ ను టార్గెట్ చేసి వరుసగా ప్రచారం చేశాయి.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు హైదరాబాద్ లోని హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై మంగళవారం తనిఖీలు నిర్వహించి ఉత్తేదే అని తేల్చారు. అయితే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షాగౌస్ హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం నాచారం లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపారు.
పాతికేళ్లుగా హోటల్ బిజినెస్లో ఉన్న తమకు, 15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులు వచ్చాయని షాగౌస్ హోటల్ యజమాని రబ్బానీ విలేకరులతో తెలిపాడు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. నగరంలోని పలు హోటళ్ల యజమానులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
అయితే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచే కబేళాల నుంచి కాకుండా, బయటి నుంచి మాంసం కొనుగోలు చేస్తుండటంతో గ్రేటర్ పరిధిలోని ఆయా హోటళ్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more