కొత్త నోట్ల కష్టాలకు చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 29 నుంచి కొత్త నోట్లను, పాత చెల్లుబాటుల నోట్లను ఎంత మొత్తం డిపాజిట్ చేస్తే, అంత మొత్తాన్ని అదనంగా బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
అంటే మీ వద్ద రూ. 2000, రూ. 500 కొత్త నోట్లతో పాటు చెలామణిలో ఉన్న నోట్లు తదితరాలు కలిపి ఓ పది వేల రూపాయలు ఉన్నాయనుకోండి. వాటిని బ్యాంకులో వేస్తే, మీరు ప్రస్తుతం ఉన్న విత్ డ్రా పరిమితి రూ. 24 వేల కన్నా, అధికంగా రూ. 10 వేల రూపాయిలు అంటే మొత్తంగా రూ. 34 వేలను బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.
బ్యాంకుల నుంచి బయటకు వెళ్లిన కొత్త నోట్లు తిరిగి డిపాజిట్ల రూపంలో రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ప్రజలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఇక కరెంటు ఖాతాలో రూ. 50 వేల పరిమితికి అదనంగా ఎంత డిపాజిట్ చేస్తే, అంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం నేటి నుంచి అమల్లోకి రానుంది .వ్యవస్థలో మరింతగా నగదు చెలామణిని పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నవంబర్ 29 నుంచి ఎవరైనా ప్రస్తుతం చెల్లుబాటయ్యే కరెన్సీ(రూ. 2000, 500, 100, 50, 20, 10, 5) రూపంలో ఎంత డిపాజిట్ చేస్తే అతని విత్డ్రా పరిమితి ప్రస్తుత లిమిట్(వారానికి రూ. 24 వేలు)కి అదనంగా పెరుగుతుంది. చెల్లుబాటు కరెన్సీకి నేటి నుంచి పరిమితి వర్తించదన్న ఆర్బీఐ, ప్రస్తుతమున్న విత్డ్రా గరిష్ట పరిమితి దృష్ట్యా చాలామంది ఖాతాదారులు నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతుండంతో ఈ నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more