దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంపై దేశ వ్యాప్తంగా కొందరు నిరసనగళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి చుక్కలు చూపించే ఈ చర్య ఖచ్ఛితంగా తుగ్లక్ ని తలపిస్తుందని ప్రతిపక్షాలతో సహా పార్టీలన్నీ విరుచుకుపడుతున్నాయి. అయితే రాజకీయ కోణంలో విమర్శలు వెలువెత్తుతున్నప్పటికీ, మేధావులు, ముఖ్యంగా సాధారణ పౌరులు దీనిపై సానుకూలంగానే ఉన్నారు.
నల్లధనం బయటికి రావటమే కాదు, దేశానికి మేలు చేసే ఈ చర్య ఎంతో అభినందనీయమైందని అంతర్జాతీయ మీడియాతో సహా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త నోట్ల వ్యవహారంతో నకిలీ కరెన్సీకి కూడా చెక్ పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్ లోని పెషావర్ లో భారత కరెన్సీని నోట్లను అధికారికంగానే నకిలీ చేస్తున్నారనే ఈ మధ్య మీడియాలో కూడా చూశాం.
మరి మోదీ చేసిన ఈ బ్లాక్ మనీ సర్జికల్ స్ట్రైక్స్ పై పాకిస్థాన్ ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది?. అవును... ఆ దేశ ఆర్థికవేత్తలు మోదీ తీసుకున్న నిర్ణయం శభాష్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. అక్కడి టీవీ ఛానెళ్లలో ఈ అంశంపై చర్చలకు హాజరవుతున్నవారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్ మనీ బయటికి రావటమే కాదు, దేశ ఆర్థిక పురోగతి మారిపోయి అభివృద్ధి బాటలో నడుస్తుందని, పాక్ కి కూడా మోదీ లాంటి ప్రధాని అవసరం ఉందని, మన ప్రభుత్వం కూడా ఆయన ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలంటూ వారు సూచిస్తున్నారు.
అంతేకాదు ప్రస్తుతం చైనాతో ఎలాగైతే శాంతియుత చర్చలు జరుపుతున్నారో, అదే విధంగా పాక్ తో కూడా సంప్రదింపులు జరపాలని, ఈ విషయంలో మోదీ సానుకూలంగా స్పందిస్తేనే ఇరుదేశాలు అభివృద్ధి బాటలో కొనసాగటం ఖాయమని వారు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఇండియాలో మోదీ వ్యతిరేక గణం అంతా ఈ నిర్ణయంపై విరుచుకుపడుతుంటే, దాయాది దేశం పొగడటం ఇప్పుడు చిత్రంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more