కరెన్సీ మార్పు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా నల్ల ధనం గురించి ఆదాయపు పన్నుల శాఖ ఓ కన్నేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి షాక్ టాలీవుడ్ కే ఇచ్చారు అధికారులు. ఇండియా బిగ్గెస్ట్ మూవీ 'బాహుబలి' నిర్మాతలపై ఐటీ శాఖ కాసేపటి క్రితం దాడులు చేసింది.
హైదరాబాదులోని 'బాహుబలి' నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కాగా, భారతీయ సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ వినియోగంపై పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాహుబలి' నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ దాడులపై సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. మీడియాలో హైలెట్ కావటం కోసమే ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని చెబుతున్నాడు. ఏం చేయాలో పాలుపోనీ అధికారులు ఇలా దాడుల ద్వారా మీడియాలో కనిపిస్తున్నారని, అయినా నిర్మాతలెవరూ డబ్బులను ఇళ్లలో పెట్టుకోరంటూ ఆయన వ్యాఖ్యానించాడు.
గతంలో రాజమౌళి సన్నిహితుడైన వారాహి నిర్మాణ సంస్థ అదినేత సాయి కొర్రపాటి ఇంట్లో ఐటీ దాడులు జరిగిన విిషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more