తమ నాయకులను సహచరుటను భారీ సంఖ్యలో కోల్పోయిన మావోయిస్టులు పోలీసులపైకి ప్రతిదాడులతో తిరగబడుతున్నారు. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మళ్లీ కాల్పులు మొదలయ్యాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య పైరింగ్ జరుగుతోంది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి జరిగిన ఎన్కౌంటర్ అనంతరం కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలంలో 50కిట్ బ్యాగులు ఉండగా, మరణించింది కేవలం 23 మంది కావడంతో పోలీసులు మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి బలిమెల రిజర్వాయర్ నుంచి పడవలో మావోలు నదిని దాటి వెళ్లివుంటారని గ్రేహౌండ్స్ బలగాలకు సమాచారం అందింది. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే గ్రేహౌండ్స్కు చెందిన కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా నిన్న అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలో మావోలు ప్లీనరి నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన గ్రేహౌంట్స్ పోలీసులు.. ఏకంగా 24 మంది మావోయిస్టులను హతమార్చారు. కాగా ఈ దాడుల నుంచి మావోయిస్టు అగ్రనేత అర్కే సహా మరికోందరు తృటిలో తప్పించుకున్నారని సమాచారం. అంద్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మల్కాన్గిరి అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పులు జరిగాయి.
ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్ ప్లీనరీపై పక్కా స్కెచ్తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలోని తొమ్మిది కిలో మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఈ దాడి చేసినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్, ఏడు ఎస్ఎల్ఆర్లు, ఏడు ల్యాండ్మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జంత్రి అటవీప్రాంతం ఘటనలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా పక్కా సమాచారం తెలుసుకున్న ఆంధ్ర-ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు రంగంలోకి దిగారు. బలిమెల రిజర్వాయర్లోని ఏవోబీ కటాఫ్ ఏరియా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ప్లీనరీ జరుగుతున్న సమావేశంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు ఆయుధాలతో తేరుకునేలోపే పోలీసుల ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయపడ్డారు.
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్తుగా మావోయిస్టులు పట్టు కోల్పోయిన ఏవోబీలో మళ్లీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more