తమిళనాడులోని కన్యాకుమారి సూలల్ పంచాయతీ పరిధిలోని పల్లకుజి మెలవిల్లై గ్రామం జనాలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. విషయం తెలుసుకున్న టీవీ చానెళ్లు ఆసక్తిగా ఆ గ్రామానికి వెళ్లాయి. వారంతా ఓ స్మశానంపైపు పరిగెడుతుండటంతో వారిని ఫాలో అయ్యాయి. అక్కడ ఓ 55 ఏళ్ల వృద్ధురాలు స్మశాన వాటికలో తాపీగా కూర్చుని ఉంది, పక్కనే గ్రానైట్ రాళ్లతో ఓ అందమైన సమాధి నిర్మాణం జరుగుతోంది. పాపం ఎవరు పోయారో? ఏం జరిగిందో? అని ఆరాతీసిన మీడియాకు పెద్ద షాకే తగిలింది. అది ఆవిడగారి కోసమే...
అపీయన్ అనే వ్యక్తి ఒకప్పుడు ఆ గ్రామానికి పెద్దదిక్కుగా ఉండేవాడు. ఆయనకు ఆరుగురు సంతానం. అందులో ఒకరే ఈ రోజీ. అయితే తన వారంత చనిపోవటం, ఆమె పెళ్లి కూడా చేసుకోకపోవటంతో ఒంటరిగా మిగిలిపోయింది. స్థానికంగా జీడి తోటల్లో పనిచేస్తూ జీవిస్తోంది. వచ్చిన సంపాదనలో కొంత పొదుపు చేసి ఏడు సెంట్లలో ఓ గది నిర్మించుకుని అందులో ఉంటోంది.
‘‘నీకంటూ ఎవరూ లేరు. ఎందుకంతలా కష్టపడతావు. నీవు చనిపోయాక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా ఎవరూ లేరు కదా’’ అని ఇరుగుపొరుగువారు రోజీని ప్రశ్నించడంతో నిజమే అనుకున్న ఆమె వెంటనే పనిమానేసి కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ(ఎంఎన్ఆర్ఈజీఎస్)లో చేరింది.
నిజమే తనకు ఎవరూ లేరు కదా. మరి తాను చనిపోతే అంతిమ సంస్కారాలు చేసేది ఎవరు? అన్న ఆలోచనే ఆమెతో ఇలా సమాధిని నిర్మించేలా చేసింది. తాను చనిపోయాక ఎవరికీ భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెబుతోంది. నెల రోజుల క్రితం సమాధి నిర్మాణ పనులు చేపట్టింది. గ్రానైట్ రాళ్లతో అందంగా సమాధిని నిర్మించుకుంది. అంతేకాదు తన ఫొటో, పేరు, వివరాలతో ఓ ఫలకాన్ని కూడా సమాధి పైభాగంలో సిలువ కింద అమర్చింది.
తాను చనిపోయాక ఇందులో సమాధి చేయడం చాలా సులభమైన పని అని, తలవైపు ప్రాంతంలో చిన్న గొయ్యి తవ్వడం ద్వారా మృతదేహాన్ని సులభంగా అందులోకి చేర్చవచ్చని రోజీ చెబుతోంది. ఇప్పుడీ సమాధి సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more