నవ్యాంధ్ర ప్రత్యేక హోదా అంశం పూర్తిగా పాడెక్కి, కేవలం స్పెషల్ ప్యాకేజీతోనే సరిపెట్టేస్తున్న కేంద్ర వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ఆర్థిక సాయం గురించి పూర్తిగా విన్నాక, ఆపై హోదా గురించి అడుగుదామని అధికార పక్షం చెబుతుండగా, అలా కుదరదని, సర్వరోగ నివారిణి స్పెషల్ స్టేటస్ అన్న చందాన విపక్షాలన్నీ కలిసి ఏపీని అట్టుడికేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయి పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదంటే ప్రతిపక్షాలు ఎంత మొండి వైఖరితో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా అర్థంతరంగా కేంద్రం ప్రకటన చేయటం వెనుక పవన్ సభ ఉండటమే కారణమన్న బలమైన వాదన ఉంది. జనసేన ఆధ్వర్యంలో కాకినాడ వేదికగా రేపు ( సెప్టెంబర్ 9, శుక్రవారం) ఆంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. తిరుపతి సభలోనే పవన్ ఈ విషయం ప్రకటించడం, ఆపై డ్యామేజ్ ముందుగానే ఊహించిన చంద్రబాబు ఆదేశించడటంతో కదలిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మరో ఎంపీ కొనకళ్ల విరామం లేకుండా చర్చలు జరిపి చివరకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ పై సూత్ర ప్రాయ ప్రకటన చేయించారన్నది ఇట్టే అర్థమైపోతుంది.
తద్వారా జనసేన సభ ద్వారా పవన్ చూపించే ఇంపాక్ట్ ను కొంతమేర అయినా తగ్గించవచ్చనేది అటు బీజేపీ, ఇటు టీడీపీ వేసిన ఫ్లాన్. ఇది బాగానే ఉన్నప్పటికీ, చేసే ఆర్థిక సాయం విషయంలో కూడా క్లియర్ ప్రకటన చేయకపోవటం, వివరాలను సంబంధిత సైట్లో పెడతామంటూ జైట్లీ చెప్పటంతో అంశంపై కాస్త గందరగోళం నెలకొంది. దీంతో కేంద్రం నుంచి ఎటుకానీ ప్రకటన రావటంతో ఆత్మగౌరవ సభ జరిపి తీరాలన్న ఆలోచనలోనే జనసేన ఉంది. ఈ మేరకు జేఎన్టీయూ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఈ సభ వేదికగా పవన్ ఓవైపు ప్రత్యేక ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఇంకోవైపు ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న హోదా అంశంపై నినదించే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more