అయ్యా ఓ రూపాయి... అమ్మా ఓ రూపాయి... బాబా ధర్మం అంటూ సిగ్నల్స్ దగ్గర, రోడ్ల పక్కన అడుక్కునే వాళ్లను చూసి జాలితో కరిగిపోయి ఓ రూపాయి చేయటం మనకు అలావటే. కానీ, గ్రేటర్ అధికారులు మాత్రం రెచ్చిపోయి అపర కర్ణుడిలా వాళ్లకి దానం చేయొద్దంటున్నారు. చచ్చినా వాళ్ల ప్లేట్ లో పైసా విదలచకండి అని చెబుతున్నారు. అధికారులు అంత కర్కోటకులా అనుకుంటున్నారా? లేదు లేదు. నానాటికీ భాగ్యనగరంలో యాచకులతోపాటు పెరిగిపోతున్నారు. అదే రేంజ్ లో వారి సంపాదన కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో, నగరంలో యాచకులంతా కలసి నెలకి రాబట్టే ఆదాయం వింటే మీ గుండె ఆగిపోతుంది.
నెలకి వారు సంపాదించే ఆధాయం అక్షరాల 2 కోట్లు. అంటే సాలినా వారు సంపాదించేంది 24 కోట్లు అన్నమాట. ఏ గతీ లేక బిచ్చగాళ్లుగా మారిన వారు కేవలం 2 శాతమేనట. మిగతా 98 శాతం దీన్ని ఒక వ్యాపారంగా తీసుకుని దిగారంట. ఈ విషయాలను స్వయానా నగర మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాకు వెల్లడించారు. ఈ ముష్టి మాఫియాకు పుల్ స్టాప్ పెట్టేలా త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు ఈనెల 23న సంయుక్తంగా సమావేశం నిర్వహించి వారి పని పట్టేందుకు సిధ్ధమవుతున్నారు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు. అరబ్ దేశాల్లో యాచకవృత్తిని తీవ్రనేరంగా పరిగణిస్తారు. ఆ తరహాలో ఇక్కడ చట్టాలు తేవడం ద్వారా ఫలితం ఏమన్నా ఉంటుందా అని అధికారులు ఆలోచనలో పడ్డారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more