మృత్యువును ఎవరూ తప్పించలేరంటే ఇదే.. ఆర్టీసీ బస్సులో కులాసాగా కూర్చున్న ఆ యువకుడు మరికొద్ది సేపట్లో ఇంటికి వెళతాను.. రేపు ఇది చేయాలి.. అది చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ ఆలోచనలు అలా ఉండగానే.. గిలగిల కొట్టుకుంటూ ప్రాణం కోల్పోయాడు. ఈ దారుణం సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో రవీంద్రభారతి సమీపంలో జరిగింది. ఆర్టీసీ బస్సులో కూర్చొని ప్రయాణిస్తున్న ఆ యువకుడికి ఊహించని విధంగా పక్క బస్సు రాడ్ కిటికీలోంచి దూసుకొచ్చి గొంతులో గుచ్చుకుంది. దీంతో యువకుడు బస్సులోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదిలాడు. ఆ యువకుడిది ప్రకాశం జిల్లా కనిగిరి. పేరు వి.ఈశ్వర్రావు. వయస్సు 23 ఏళ్లు. కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్ క్యాంటీన్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి అంబర్పేట్లో నివాసం ఉంటున్నాడు.
డ్యూటీ అయిపోగానే.. కోఠీ వెళ్లే 127K (AP28Z0547) బస్సులో బయల్దేరాడు. రవీంద్రభారతి సిగ్నల్ దగ్గర… పక్కనే ఉన్న మరో మెట్రో బస్సును ఓవర్టేక్ చేస్తూ బస్సు ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మెట్రో బస్సు అద్దాల దగ్గర ఉన్న ఇనుప రాడ్డు 127కే బస్సు చివర అద్దానికి తగిలి.. నేరుగా లోపలికి దూసుకొచ్చింది. బస్సు వెనుక సీట్లో కిటికీ దగ్గర కూర్చున్న ఈశ్వర్రావు గొంతులోకి దిగింది. దీంతో ఈశ్వర్రావు అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి వారు షాక్ గురయ్యారు. అప్పటి వరకు తమతో కూర్చున్నవాడు ఇలా ప్రాణాలు వదలడంతో నిశ్చేష్టులయ్యారు. ఈ ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ శ్రీనివాసులు అక్కడ్నుంచి పరారయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more