క్రిమినల్ గా ముద్రపడ్డ తాను ఇప్పట్లో ఇండియాకు రాలేనని తేల్చేశాడు కింగ్ ఫిషర్ అధినేత మాల్యా. దేశానికి రావడానికి ఇది సరైన టైమ్ కాదని చెప్పాడు. ‘ద సండే గార్డియన్’ ఇ-మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నలకు మాల్యా సమాధానమిచ్చాడు. మీరు భారత్కు ఎప్పుడు తిరిగి వెళ్లనున్నారని ప్రశ్నించగా, ‘నేను భారతీయుణ్ని. నాకూ తిరిగి వెళ్లాలనే ఉంటుంది. అయితే నా వాదనను సమర్ధించుకుని, చెప్పుకునేందుకు సానుకూల పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. ఇప్పటికే క్రిమినల్గా నాకు ముద్ర వేశారు. అందుకే ఇది తగిన సమయం కాదన్నది నా భావన’ అని మాల్యా తెలిపారు. ‘నన్ను విలన్ను చేయొద్దు. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి. ఒకవేళ మాట్లాడితే ఆ మాటలు మరికొందరిని కష్టాల్లో పడేసే అవకాశం ఉంద’ని పేర్కొన్నారు. ‘నేనేమీ తప్పు చేయలేదు. నేనూ బాధితుణ్నే. ఎప్పడూ అందుబాటులో ఉండేవాడిని, దాక్కునేలా చేశారు. ఇందువల్ల నేను అనారోగ్యానికి గురయ్యా’ అని మాల్యా వివరించారు.
మరోవైపు భవిష్యత్ ప్రణాళికను తెలియజేయాలంటూ పీటీఐ పంపిన ఇ-మెయిల్కు మాల్యా నుంచి స్పందన రాలేదు. అయితే తన కోసం బ్రిటన్లో మీడియా అన్వేషిస్తోందని.. మాల్యా ట్వీట్ చేశారు. ‘బ్రిటన్లో మీడియా నా కోసం వెతుకులాడుతోంది. బాధపడాల్సింది ఏంటంటే.. ఇప్పటికీ వారు సరైన ప్రాంతాన్ని కనుగొనలేదు. అయినా నేను మీడియాతో మాట్లాడను. అందువల్ల మీ శ్రమను వృథా చేసుకోకండి’ అని ట్విటర్లో తెలిపారు. నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాల్యా తరుపు న్యాయవాది హెచ్.సుధాకర్ రావు చెప్పారు. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారులను న్యాయస్థానానికి రప్పించేందుకు చట్టాలను పూర్తి సాయిలో ఉపయోగిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. అయితే ఆయన ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ ఆదేశించగా, చెల్లని చెక్కు (చెక్ బౌన్సు) కేసు విచారణకు మాల్యా గైర్హాజరు అవ్వడాన్ని పరిగణనలోకి తీసుకొని నాంపల్లి కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో భారత్కు తాను తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more