భారతదేశం అంటేనే సర్వమతాల సమ్మేళనం. మతాలు వేరయినా కానీ మనుషులు మాత్రం ఒక్కటే. అయితే గత కొంత కాలంగా మన దేశంలో అసహనం కుదిపేస్తోంది. కానీ ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి మాత్రం మత సహనం అంటే ఏమిటో చెబుతోంది. తనకు తెలిసిందల్లా కేవలం చదువుకోవమే అయినా దానితోనే అందరికి కనువిప్పు కలిగిస్తోంది. ఆమె ఓ ముస్లిం అమ్మాయి అయినా కానీ ఆమెను కేవలం ఖురాన్ మాత్రమే చదవాలని ఆమెకి ఎవరూ చెప్పలేదు... అందుకే రామాయాణం కూడా చదివింది. అంతేకాదు మహాభారతం కూడా త్వరలో ఔపోసన పట్టేస్తానని అంటోంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మత సహనానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారా..? ఆ అమ్మాయి రామాయణాన్ని అవపోసన పట్టింది.
కర్ణాటకలో రాష్ట్రస్థాయి రామాయణంపై పెట్టిన పరీక్షలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఆ పరీక్షలో 93 శాతం మార్కులు తెచ్చుకుంది. దీనిని భారత సంస్కృతి ప్రతిష్ఠాన్ సంస్థ గత ఏడాది నవంబర్లో నిర్వహించింది. వాటి ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కర్ణాటక - కేరళ సరిహద్దులో ఉండే సుల్లియపడవు గ్రామంలో సర్వోదయ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది రహీలా. ఆ స్కూలు నుంచి 39 మంది ఈ రామయణం రాత పరీక్షలో పాల్గొన్నారు. ఆమె తన అంకుల్ సాయంతో రామాయణం చదువుకున్నానని తెలిపింది. ఆమె తండ్రి ఓ ఫ్యాక్టరీలో పనివాడు. త్వరలో మహాభారతంపై కూడా రాత పరీక్ష జరుగబోతోంది. ఆ పరీక్షలో టాపర్ గా నిలవాలని రహీలా కోరుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more