Congress party won one and only seat in GHMC

Congress party won one and only seat in ghmc

Congress party, TRS, KCR, KTR, GHMC,GHMC Election, Telangana

Congress party won one and only seat in GHMC

గ్రేటర్ లో కాంగ్రెస్ కు ఒకే ఒక్క సీటు

Posted: 02/05/2016 05:40 PM IST
Congress party won one and only seat in ghmc

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ జిల్లా పటాన్ చెరు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పరాజయం పొందారు. అలాగే మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. గ్రేటర్ ఫైట్లో కాంగ్రెస్ కేవలం నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి పరిమితం అయింది.   ఫలితాల సరళి ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు మించి కార్పొరేట్ సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.
 
గత గ్రేటర్ ఎన్నికల్లో 52 డివిజనల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్-ఎంఐఎంతో కలసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున బండ కార్తీక రెడ్డి మేయర్గా ఎన్నిక కాగా, ఆనక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్కు మేయర్ పదవిని అప్పగించారు. అయితే తాజా ఎన్నికల్లో సీన్ మారింది.  కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రం గౌడ్ తో పాటు మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి కూడా పరాజయం పాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress party  TRS  KCR  KTR  GHMC  GHMC Election  Telangana  

Other Articles