రాష్ట్ర విభజన జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు మావోయిస్టుల సమస్య తలెత్తుందని అప్పట్లో రేకెత్తిన అనుమానాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయా అంటే.. అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను కిడ్నాప్ చేసి.. పలు హెచ్చరికలతో వారిని విడిచిపెట్టిన మావోలు.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమ ఉనికి చాటుకునేందుకు సిద్దమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది మహిళలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసి, వారిపై బలవంతంగా అత్యాచారాలకు పాల్పడి.. వ్యభిచార రోంపిలోకి దింపిన వారిని మావోయిస్టులు టార్గెట్ చేశారన్న వార్తలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ మేరకు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. కాల్ మనీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. కాల్ మనీ నిందితులను రక్షించడంలో ప్రభుత్వం, పోలీసులు తలమునలై ఉన్నారని ఆరోపించారు. కాల్ మనీ సెక్సురాకెట్ లో వున్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ దురాగతాన్ని మరుగున పరచడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పనిచేస్తోందని మండిపడ్డారు. వేతనాల పెంపు కోసం 'ఛలో విజయవాడ' కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీ మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద డ్రామాగా మావోయిస్టులు వర్ణించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ప్రజలను, రాజకీయ పార్టీలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా చేశారని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులకు శిక్షించే వరకు పోరాడాలని ప్రజలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు. కాల్ మనీ బాధ్యులపై కఠిన శిక్షలు తీసుకోకుంటే ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదన్నారు. సెక్స్ రాకెట్ దుర్మార్గులను ప్రజాకోర్టులో హతమారుస్తామని హెచ్చరించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more