ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ వ్యక్తి దడపుట్టిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు చేసి.. చేసి.. తలపండిన బాబుగారికి తలనొప్పిగా మారాడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు గారిని నిలదీస్తుండటంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. కాల్ మనీ వ్యవహారంపై నడుస్తున్న తీవ్ర దుమారానికి చంద్రబాబు ఒక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాల్ మనీ వ్యవహారంపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వలేక.. ప్రతిపక్షాల ప్రశ్నలకు తాళలేక తీవ్ర వత్తిడిలో ఉన్నారు బాబుగారు. ఇంతకీ ఇంతలా చంద్రబాబును ఇబ్బందిపెడుతున్న వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా..? ఇంకెవరు ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్.
ఏపి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఒక్కరిబిక్కిరి చేస్తూ.. ప్రతిపక్ష అంటే ప్రతి అంశాన్ని ప్రశ్నించడం అన్న దానిని నిజం చేస్తున్నారు జగన్. కాల్ మనీ వ్యవహారం మీద ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ప్రతిపక్షాల వాదనలకు విలువనివ్వకుండా.. ఏకపక్షంగా సాగుతుండటం మీద కూడా జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు అండ్ సర్కార్ ఇబ్బందిలో పడింది. కాల్ మనీ మీద అసలు చర్చను వదిలేసి.. కేవలం సిఎం స్టేట్ మెంట్ ఇస్తే.. దాని క్లారిఫికేషన్ మీద మాట్లాడటానికి మాత్రమే ప్రభుత్వ అవకాశం ఇవ్వడాన్ని జగన్ వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలా అని నిలదీస్తున్నారు జగన్.
జగన్ అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్ మెంట్స్ ...
* ఐదు రోజులు ఎందుకు పెట్టారు..?
* మధ్యాహ్నం వరకే ఎందుకు సభ ఎందుకు పెట్టారు..?
* అంబేద్కర్ మీద చర్చించడానికి మరో రెండు రోజులు సభను పొడగించవచ్చు కదా..? అలా ఎందుకు చెయ్యడం లేదు..?
* ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా..?
* పది నిమిషాలు మాట్లాడాలని ప్రభుత్వం అనడం ఏంటి..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more