ప్రస్తుత రోజుల్లో ‘సెల్ఫీ’ పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలివారు వరకు, చిన్న స్థాయి నుంచి ఉన్నత పదవిలో వున్నవారంతా దీని మోజులో మునిగి తేలుతున్నారు. అయితే.. ఈ సెల్ఫీ మోజు కొందరి ప్రాణాలను బలితీసుకుంటుండగా.. మరికొందరిని వివాదంలో పడేస్తున్నాయి. అలాగే.. ఓ హీరోయిన్ తో కలిసి సీఎం తీసుకున్న సెల్ఫీపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(బీజేపీ) బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్తో సెల్పీ తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.
చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ వారు సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా హాజరు కాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్లు అవార్డులు అందజేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమణ్ సింగ్ నటి కరీనాతో సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. అంతే! ఎప్పుడెప్పుడు విమర్శలు చేద్దామా అని వెయిట్ చేస్తున్న విపక్ష పార్టీ నేతలకు ఈ సెల్ఫీ వ్యవహారం దొరికింది. ఇక వాళ్ళు తన చేతిలో మైకులు పట్టుకుని సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. ‘సీఎం స్థాయిలో వుండి నటితో అలా వ్యవహించడం ఏంటి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు.
రాష్ట్రంలో ఓ పక్క రైతుల ఆత్మహత్యల కొనసాగుతుంటే, వాటిని పట్టించుకోకుండా ఎంచక్కా సినీ తారలతో సెల్ఫీలు తీసుకుంటూ సీఎం బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అంశాలను పట్టించుకోకుండా సినీ తారలతో ముఖ్యమంత్రి సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి.. ఈ కామెంట్లపై సీఎం రమణ్ సింగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more