వరంగల్ ఉప పోరుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజయ్య గెలుపే లక్ష్యంగా సీనియర్లంతా ప్రచారానికి రెడీ అయ్యారు. దిగువ స్థాయి శ్రేణులను కూడా ప్రచారంలో భాగస్వాములు చేసేలా సరికొత్త కార్యాచరణతో రంగలోకి దిగుతున్నారు. సినీ తారలతో ప్రచారం గురించి కూడా ఆలోచిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. అభ్యర్థి ఎంపీకలో ఆచితూచి వ్యవహరించిన హస్తం పార్టీ.. సిరిసిల్ల రాజయ్యను రంగంలోకి దింపింది. బేధాభిప్రాయాలు పక్కన పెట్టి, గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు టీపీసీసీ నేతలు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి సీనియర్లు సైతం ప్రచారంలో పాలుపంచుకొనున్నారు. ఇందుకోసం గాంధీభవన్ లో సుమారు మూడు గంటలకు పైగా చర్చించారు. వరంగల్ లో విజయం కోసం ఏమేమి చెయ్యాలో ఆలోచించారు. రాహుల్ దూతగా వచ్చిన కొప్పుల రాజుకు తమ అభిప్రాయాలను వివరించారు.
వరంగల్ ప్రచారంలో... సీనియర్ నేతలకు నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పగించింది టిపిసిసి. భూపాలపల్లి నియోజక వర్గానికి జానారెడ్డి, వర్ధన్నపేటకు భట్టి విక్రమార్క, వరంగల్ ఈస్ట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ వెస్ట్ కు షబ్బీర్ అలీ, పరకాలకు జీవన్ రెడ్డిని ఇంచార్జ్ లు్గా నియమించారు. మండల స్థాయిలో కూడా ఇంచార్జ్లను నియమించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉండే ఏడు నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలు, పాదయాత్రలు నిర్వహించి, టీఆర్ ఎస్ కు దీటుగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు. ఆరు, ఏడూ తేదిల్లో జెండా పండుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన ఇంటి పై పార్టీ జెండా ఎగురవెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 8 నుంచి 14 వరకు డోర్ టూ డోర్ ప్రచారం తో పాటు, 15 నుంచి 19 వరకు నియోజక వర్గాల్లో బహిరంగా సభలు నిర్వహిస్తారు. ఇప్పడికే ఓరుగల్లులో ప్రచారానికి 40మందితో స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ను కాంగ్రెస్ ప్రకటించింది. మరి ఈ హస్తం నేతల కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more