డబ్బులకోసం మోసాలకు పాల్పడడంలో పురుషులకు తామూ ఏమాత్రం తీసిపోమని మహిళలు సైతం అడ్డదారులు తొక్కేస్తున్నారు. కిడ్నాప్ లకు పాల్పడటం, ప్రేమ పేరుతో వల వేయడం, ఇంకా పెళ్లి చేసుకుని ఆపై ఆస్తి కాజేయడం కోసం రకరకాల సన్నాగాలు పన్నడం.. ఇలా ఎన్నోవిధాలుగా మహిళలు మోసాలు చేస్తుంటారు. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఓ మహిళ ‘నిత్య’ పెళ్లికూతురి అవతారం ఎత్తింది. కాస్త డబ్బులున్న వ్యక్తి కనిపిస్తే చాలు... పేరు మార్చుకుని అతని ముందు వాలిపోయి, పెళ్లి పీటలు ఎక్కించి ఆపై మోసం చేయడం ఆమె నైజం. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురిని పెళ్లాడింది. అంతేకాదు.. తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నని చెప్పి, ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసింది. చివరికి ఆస్తి కోసం బంధువులు చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు, రాణి, బుజ్జి, లేఖ్యారెడ్డి, హేమలత... ఇలా ఎన్నో పేర్లు మార్చింది. చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆమె.. దొడ్డిదారిలో డబ్బులు సంపాదించుకోవాలని నిర్ణయించింది. అంతే! అందుకు తనదైన రీతిలో ప్లాన్ వేసుకుంది. మొదట ఆమె ఎల్బీ నగర్ కు చెందిన రవీంద్రను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త వేధిసున్నాడంటూ ఎల్బీ నగర్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆపై బోరబండకు వచ్చి జగదీష్ అనే వ్యక్తిని, తరువాత పూర్ణచందర్ ను, నాలుగో పెళ్లిలో కరీంనగర్ కు చెందిన కిశోర్ ను వివాహం చేసుకుంది. వీరందరిపైనా వేధింపుల కేసులు పెట్టి వదిలించుకుంది. అలా వారినుంచి విడిపోయిన అనంతరం ఈమెకు ఆయా భర్తలనుంచి డబ్బులు కూడా బాగానే అందాయి. దాంతో ఈమెకు డబ్బు పిచ్చి మరింత ముదిరిపోయింది. అంతటితో ఆగకుండా మరింత డబ్బును సంపాదించేందుకు మరో పన్నాగం పన్నింది.
తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నట్టు ఆమె పరిచయం చేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత వారికి కనిపించకుండాపోయింది. దీంతో తాము మోసపోయామని డబ్బులు ఇచ్చిన వారు వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేయించారు. ఆమెను గాలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు కానీ.. దొరకలేదు. ఇంతలోనే ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కింది. ఆస్తికోసం బంధువులు చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. అంతే! ఆమె గురించి విచారించిన అనంతరం మొత్తం బండారం బయటపడింది. ప్రస్తుతం ఆమెపై ఏడు కేసులు ఉన్నాయని, ఇప్పుడు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టామని పోలీసులు తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more