ghmc official take over dk aruna land at jubilee hills check post

Ghmc officials acquired land at jubilee hills amid tension

former minister dk aruna at jubilee hills, dk aruna land at jubilee hills check post, dk aruna land acquired by ghmc officials, tension arose at jubilee hills check post

ghmc officials acquired land at jubilee hills amid tension, sources said that the land belongs to be former minister dk aruna

మాజీ మంత్రి డీకే అరుణకు ఝలక్.. రూ.40 విలువైన స్థలం స్వాదీనం

Posted: 10/04/2015 12:28 PM IST
Ghmc officials acquired land at jubilee hills amid tension

మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలను సంధిస్తున్న అరుణపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాలో అరుణ తనదిగా చెప్పుకుంటున్న రూ.40 కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్-10  టౌన్‌ప్లానింగ్ అధికారులు పెట్రోల్‌బంక్‌ను ఆనుకొని ఉన్న 400 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

భారీ పోలీసు బందోబస్తు మధ్య టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి నేతృత్వంలో కూల్చివేతలు సాగాయి. అరుణ సంబంధీకులు అడ్డుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స్థలం సొసైటీ లే అవుట్‌లో ఖాళీ స్థలంగా గుర్తించారు. సొసైటీకి  గాని, భరత సింహారెడ్డికిగాని ఈ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. కమిషనర్ సోమేష్‌కుమార్ ఆదేశించడంతో అధికారులు మూడు గంటల్లోనే ఆక్రమణలను తొలగించారు. కొంత కాలంగా భరత సింహారెడ్డి ఈ స్థలాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. సొసైటీ కూడా ఈ స్థలం తమదేనంటూ పేర్కొంటుండడం గమనార్హం. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులు ఇకపై అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఈ చర్యతో చాటిచెప్పిందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dk aruna  gadwal mla  jubilee hills check post  dk aruna land  

Other Articles