ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆ వార్తలు ఆమధ్య తెగ చక్కర్లు కొట్టాయి. వాటిల్లో ముఖ్యమైంది ఆయన లవ్ ఎఫైర్. టీవీ యాంకర్ అమృతారాయ్ తో కలిసి ఆయన దిగిన ప్రైవేట్ ఫోటోలు ఆనాడు పెనుసంచలనాలకు దారితీశాయి. ఓ పార్టీ సీనియర్ నాయకుడు అయి వుండి కూడా.. యాంకర్ తో ఎఫైర్ నడపడమేంటని అందరూ నోళ్లవెళ్లకోసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై, యాంకర్ పై కొన్నాళ్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో వాళ్లిద్దరూ ఆ ఫోటోలపై వివరణ ఇచ్చుకుంటూ.. తామిద్దరం పీకల్లోతు ప్రేమలో మునిగివున్నామని స్పష్టం చేశారు. అంతే.. ఆ తర్వాత మళ్లీ వారి ఎఫైర్ కి సంబంధించిన వార్తలు వెలుగులోకి రాలేదు.
అయితే.. ఇటీవల వీరిద్దరి ప్రేమవ్యవహారానికి సంబంధించి ఓ ఆంగ్లదినపత్రిక కథనం రాసింది. 68 ఏళ్ల వయసున్న డిగ్గీరాజ, 44 ఏళ్ల వయస్సున్న అమృతారాయ్ ఇద్దరూ వివాహం చేసుకున్నారని ఆ పత్రిక ప్రచురించింది. ఈ కథనం నేపథ్యంలోనే అమృతా తన ఫేస్ బుక్ లో స్పందించింది. డిగ్గీరాజాతో తన పెళ్లి జరిగిపోయిందని ఆమె స్పష్టం చేసింది. వీరి వివాహం గత నెలలో హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం తమిళనాడులోని ఓ హైందవ ఆలయంలో జరిగింది. డిగ్గీరాజా, అమ్రితా గతకొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం గత ఏడాది ఏప్రిల్లో బయటకు వచ్చింది. దాంతో అప్పుడే తాను అమ్రితారాయ్ ను వివాహం చేసుకోనున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు కూడా! కానీ.. అమృతా మాత్రం స్పందించలేదు. దీంతో వారింకా పెళ్లి చేసుకోలేదన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. అమృతా అధికారికంగా వెల్లడించడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు తాజాగా డిగ్గీరాజా తమ పెళ్లి విషయంపై స్పందించారు. అమృతా చెప్పింది నిజమేనని, తామిద్దరం పెళ్లి చేసుకున్నామని ఆయన ఆ యాంకరమ్మ మాటలను ధృవీకరించారు. అమృతా తన పెళ్లి విషయాన్ని వెల్లడించిన నేపథ్యంలో.. చాలామంది ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలావుండగా.. డిగ్గీరాజా భార్య సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. 2013లో కన్నుముశారు. ఆ తర్వాత ఈయన, అమృతాల మధ్య ప్రేమవ్యవహారం నడుస్తోందని వార్తలు బయటకొచ్చాయి. ఈ వార్తలు బాహ్య ప్రపంచానికి తెలియగానే.. అమృతా తాను దిగ్విజయ్ ను వివాహం చేసుకుంటానని తెలిపారు. అమెకు గతంలోనే వివాహం జరిగింది. విడాకుల వచ్చిన తర్వాత వివాహం జరుగుతుందని గతంలోనే చెప్పారు. ఆమె చెప్పిన మాట ప్రకారం ఇద్దరు ఏడాదిన్నర కాలం తరువాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్, అమ్రితారాయ్ లు అమెరికాలో ఉన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more