ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ ప్రైవేటు ఉద్యోగి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరువక ముందే..జిల్లాలోని గూడూరు మండలం చెన్నూరులో గురువారం మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు రెండో దళితవాడకు చెందిన పల్లం రమణయ్య(40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రమణయ్య ఆత్మహత్యకు ముందు నెల్లూరు జిల్లా కలెక్టరు పేరిట మూడు సూసైడ్ నోట్లు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాక గ్రామం అభివృద్ధి చెందటం లేదని, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా గత రెండు రోజులుగా తనలోతానే మథనపడుతూ ఆందోళన చెందుతుండడాన్ని కుటుంబసభ్యులు తెలిపారు. అది గమనించి అడుగగా ఏమి లేదంటూ తాను దాటవేశాడని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రమణయ్య ఎంతకు తిరిగి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఇంటికి ఫర్లాంగు దూరంలో ఉన్న బావిలో రమణయ్య మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యులు అనుమానంతో ఇంట్లో రమణయ్యకు సంబంధించిన బ్యాగులను తనిఖీ చేయగా మూడు మరణ వాంగ్మూలాలు లభించాయి. ప్రత్యేక హోదా వస్తే అందరం బాగుంటామని పేర్కొన్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more