వివాదాస్పద ‘గాడ్ ఉమెన్’ రాధే మా ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకోగా.. తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. ఈమెతో తనకు ప్రాణహాని, తనని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని బాలీవుడ్ నటి డాలీ బింద్రా ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాధే మా, ఎంఎం గుప్తా, మరికొందరు భక్తులపై తనకు అనుమానాలు వున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాధేమా అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు దర్యాప్తు చేస్తారని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలావుండగా.. నటి డాలీ కూడా గతంలో ‘రాధే మా’ భక్తురాలే. అటువంటి ఆమె ఇప్పుడు రాధే మాపై ఫిర్యాదు చేయడంపై పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య వ్యక్తిగత పొరపొచ్చాలు చోటు చేసుకుని వుండవచ్చునని, ఆర్థిక లావాదేవీల వ్యవహారపై విభేదాలు ఏర్పడి వుంటాయని.. అందుకే ముందుజాగ్రత్తగా నటి డాలీ ఫిర్యాదు చేసి వుండవచ్చునని అంటున్నారు. మరోవైపు.. నటి డాలీ దగ్గర డబ్బులు దోచే ప్రయత్నంలో భాగంగా రాధేమా, అనుచరులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని, డబ్బు ఇవ్వని పక్షంలో చంపేస్తామని బెదిరించినట్లు అంతర్గత వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంతమాత్రం నిజమో తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే!
కాగా.. రాధేమాకు ఇప్పటికే వరకట్న కేసులో ముంబై పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే! నిక్కీ గుప్తా అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న కేసు నమోదు చేశారు. మరోవైపు.. రాధేమా మాయమాటల వల్ల గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా రమేష్ జోసి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం విదితమే! ఇలా మరెన్నో వివాదాల్లో రాధేమా చిక్కుకుంది.
AS
(And get your daily news straight to your inbox)
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more
May 19 | వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం... Read more
May 19 | నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ... Read more