మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు అని ఓ సామెత. ఎందుకు అంటే మేధావి మౌనం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అయితే .జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విఫయంలోనూ ఇలానే జరుగుతోంది అంటున్నారు కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత చాలా కాలం వరకు రాజకీయాల మీద పెద్దగా స్పందించలేదు. మార్పును కోరుకునే, ఎంతో విజన్ ఉన్న నాయకుల్లో వపన్ కళ్యాణ్ ఒకరు. రైతుల కన్నీళ్లు తుడిచే జననేతగా పవన్ కళ్యాణ్ ఒకరు అని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాను అని పదే పదే చెప్పుకొచ్చే పవన్ కళ్యాణ్ టైం వచ్చేసిందని అతని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన... ప్రశ్నించాలని ఓ సగటు మనిషిగా, తెలుగు వ్యక్తిగా చాలా మంది కోరుకుంటున్నారు.
ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తిరుపతిలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమనులు నిరసన తెలిపారు. అయితే అన్నా పవన్ కళ్యాణ్ రావాలి.. ప్రత్యేక హోదా మీ ద ప్రశ్నించాలని బ్యానర్లతో తమ నిరసను తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు అంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతుగా నిలిచినందుకూ గెలిచారని.. ఎంతో చేయగల నేత పవన్ కళ్యాణ్ ఇక స్పందించాల్సిన అవసరం ఉంది అని వారు అంటున్నారు. నిజమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది. అది అందరికి తెలుసు అది నరేంద్రమోదీ దగ్గరి నుండి చంద్రబాబు వరకు, ఢిల్లీలో ఉన్న మంత్రుల దగ్గరి నుండి గల్లీలోని మామూలు వ్యక్తులకు కూడా తెలుసు. అందుకే అందరూ కోరుకుంటున్నది ఒక్కటే పవన్ కళ్యాణ్ రావాలి... ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలని... మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more