గోదావరి మహా పుష్కరాలకు కోట్ల మంది భక్తులు క్యు కట్టారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. అయితే గోదావరి నీటిలో బాక్టీరియా సాధారణ స్థాయి కన్నా పది రెట్లు అధికంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో పుష్కర స్నానాల విషయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కవ సమయం నీటిలో ఉండవద్దు. మూడు నిమిషాల్లో స్నానం ముగించుకుని బయటకు రావాలి. కళ్లు, ముక్కు, నోటిలోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని ఎక్కవ సేపు నిటిలో ఉంచవద్దు. సాధారణంగా వంద మిల్లీ లీటర్ల నీటిలో ఈకోలీ 500 కాలనీల వరకు ఉండొచ్చు. గోదావరి నీటిలో 5 వేల వరకు ఉందని అధికారులు గుర్తించారు.
స్పచ్చంగా లేని.. బురద నీటిలో ఈకోలీ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈకోలీ నీటిలో స్నానం చేయడం ఇబ్బందికరం. ఎండ ఎక్కవగా ఉన్న నీటిలోనే స్నానం చేయాలి. కళ్లు చెవులు, నోటిలోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. మునకకు ముందు బాగా గాలి పీల్చుకుని. మూడు మునకలు వేసి బయటకు వచ్చేయాలి. పుష్క స్నానం అయిన వెంటనే మంచి నీటితో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసిన బట్టలను వెంటనే విడిచి పొడి బట్టలు ధరించాలి. పొరపాటున నీటిని నోట్లోకి తీసుకుని తాగితే వెంటనే ఏమీ తెలియదు. రెండు రోజుల తర్వాత నీరసం , వాంతులు, విరోచనాలతో కూడిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఇంకా శనివారం వరకు గోదావరి మహా పుష్కరాలు సాగునున్న నేపథ్యంలొ పుష్కర స్నానానికి వెళ్లే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించి.. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నవారవుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more