మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయన అమరణ నిరహారా దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేసి ప్రభుత్వ అస్పత్రికి తరలించినా.. ఆయన వైద్యాన్ని నిరాకరిస్తూ దీక్షను కోనసాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి హర్షకుమార్ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బెఠాయించారు. ఆ తర్వాత మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. తనపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారని, తన కుమారుడిని పోలిస్ స్టేషన్ లో బంధించారని ఆయన ఆరోపించారు.
రాజమండ్రి నగరంలో క్రైస్తవులకు శ్మశాన వాటిక, ముస్లింలకు షాదీఖానా నిర్మించాలని డిమాండ్ చేస్తూ హర్షకుమార్ అమరణ దీక్ష పూనుకున్న విషయం తెలిసిందే. హర్షకుమార్ ఆరోగ్యం విషమిస్తుండడంతో శనివారం సాయంత్రం పోలీసులు దీక్ష జరుగుతున్న సెయింట్పాల్ చర్చి మైదానంలోకి ప్రవేశించారు. పోలీసులు రావడాన్ని గమనించిన హర్షకుమార్ దీక్షను భగ్నం చేయడానికే వారు వచ్చారని, వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయితే, పోలీసులు వేదిక వైపు వస్తుండటంతో తన వద్దనున్న తుపాకీని తీసి దగ్గరకు వస్తే కాల్చుకుంటానని బెదిరించారు.
అయినా పోలీసులు వేదికను చుట్టుముట్టడంతో ఆయన రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి హర్షకుమార్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వేదిక వద్ద తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. హర్షకుమార్కూ స్వల్ప గాయాలయ్యాయి. దీక్షను భగ్నం చేసిన పోలీసులు హర్షకుమార్ను బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తానని ప్రకటించిన ఆయన అక్కడ అదృశ్యమై.. రాజమండ్రి మూడవ పట్టణ పోలీసు స్టేషనులో ఎదుట ధర్నాకు దిగారు. తనపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారని, తన కుమారుడిని పోలిస్ స్టేషన్ లో బంధించారని హర్షకుమార్ ఆరోపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more