ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ హాట్ హాట్ గా వాదనలు కొనసాగాయి. సుమారు గంటన్నరసేపు వాదనలు జరిగాయి. రేవంత్ తరపు న్యాయవాది, ఏసబీ న్యాయవాది ఇద్దరూ పోటాపోటీగా వాదించారు. నిందితునికి బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని, రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నారని, కేసులో పూర్తి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని, బెయిలు ఇవ్వకూడదని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంకా కొందరు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని, వారు పక్క రాష్ట్రం ఏపీలో దాక్కున్నారని, వారిని అరెస్టు చేసి విచారించాల్సి ఉందని, ఈ సందర్భంలో రేవంత్ కు బెయిలు ఇస్తే ఆయన కూడా ఏపీకి పారిపోయే ప్రమాదముందని ఏసీ వాదించారు.
ఏపీలో ఉన్న నిందితులను అరెస్టు చేసే విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని ఏజీ జడ్జీకి వివరించారు. ఓటుకు నోటు కేసు చిన్నదేమీ కాదని, 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వమే కూలిపోయేదని, ఇది రాజద్రోహం కేసు కిందకు వస్తుందని ఏజీ రామకృష్ణా రెడ్డి వాదించారు. ఇంకా ఈ కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉందని కూడా కోర్టులో వాదించారు. ఏసీబీ కస్టడీలో రేవంత్రెడ్డి ఏమి చెప్పలేదా అని ఏజీని జడ్జీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఏజీ సమాధానమిస్తూ.. రేవంత్ ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదని, రూ. 5కోట్ల గురించిన అడిగినా సమాధానం లేదని ఏజీ జడ్జీకి తెలిపారు. ఈ కేసులో సండ్ర వెంకట రమణ తప్పించుకు తిరుగుతున్నాడని కోర్టుకు చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ప్రకారం ఈ కేసులో ఇంకా కొంత మందిని విచారించే అవసరం ఉందని వాదించారు.ఇప్పటికే 25 రోజులకు పైగా నిందితుడు రిమాండ్ లో ఉన్నారని, ఈ సమయంలో నిందితున్ని పూర్తిగా విచారించడం జరగిందని, ఈ కసులో దాదాపు విచారణ మొత్తం పూర్తయిందని, అయినా ఇంకా నిందితున్ని రిమాండులో ఉంచాల్సిన అవసరమేముందని రేవంత్ తరపు న్యాయవాది వాదించగా దానికి కౌంటర్ గా ఏసీబీ తరపు న్యాయవాది ఏజీ రామకృష్ణా రెడ్డి తన వాదనలు వినిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more