తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టెన్షన్ ఎప్పుడు ఏం జరుగతుందా అని నరాలు తెగేంత టెన్షన్. గంట గంటకు టివి ఛానల్స్ లో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు నోటీసులు వస్తాయంటూ ఒకటే మోత. తెలంగాణ సర్కార్ అంతా సిద్దమైంది ఇక నోటీసులు ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలని అని ఆలోచనలో ఉంది అని టివి చానల్స్ చేసిన హడావిడితో తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా టెన్షన్ కు లోనయ్యారు. అయితే అంత జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. తెలంగాణ సర్కార్ ఏపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపించాలని దాదాపుగా డిసైడ్ అయింది. కానీ తర్వాత మాత్రం నోటీసుల జోలికి వెళ్లలేదు. అయితే చంద్రబాబు నాయుడుకు నోటీసులు రాకపోవడానికి ఏంటి అనే చర్చ సాగుతోంది.
* కేంద్ర ప్రభుత్వం చేసిన వత్తిడి వల్లే తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గిందా..?
* తెలంగాణ, ఏపిల మధ్య తగాదాలకు గవర్నర్ ఫుల్ స్టాప్ పెట్టారా..?
* ఫోన్ ట్యాపింగ్ వివాదం మెడకు చుట్టుకుంటుందని తెరాస భయపడుతోందా..?
* చంద్రబాబు, కేసీఆర్ అవగాహనకు వచ్చారా..?
* ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు నాయుడు వాయిస్ కాదా..?
ఏపీ సీఎం చంద్రబాబుకు వాయిస్ టెస్ట్ నిర్వహించొద్దని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులకు ఓరల్ ఇన్ స్ట్రక్షన్స్ (మౌఖిక ఆదేశాలు) అందాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు స్థాయి వ్యక్తికి నోటీసులు ఇచ్చినా, వాయిస్ టెస్ట్ చేసినా అది వివాదాస్పదమవుతుందని భావిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయంలో సంయమనంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం వంటివి చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలను టెన్షన్ పెట్టిన ఓటుకు నోటు వ్యవహారంలో ఎలాంటి డెవలప్ మెంట్ లేదు. ఇక మరో పక్క రేవంత్ రెడ్డి, మత్తయ్యల పిటిషన్ లు కోర్టులో ఈ నెల 24న వాదనకు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
//అభినవచారి//
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more