రామ మందిర అంశాన్ని ఎంతమాత్రం పక్కకు పెట్టలేదని, దానిపై తమ పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని బిజెపి అధ్యక్షుడు అమిత్షా స్పష్టం చేశారు. పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ లేదన్న సాకు చూపి రామ మందిర నిర్మాణం, 370 అధికరణం వంటి తమ సిద్ధాంత అంశాలను బిజెపి పక్కకు నెడుతోందన్న విమర్శలను అమిత్షా తిరస్కరించారు. రామ మందిర అంశం సుప్రీంకోర్టు ముందు ఉంది, సుప్రీం తీర్పును తమ పార్టీ అనుసరిస్తుందని, ఎవరైనా తీర్పును గౌరవించాల్సిందేనని అమిత్షా అన్నారు. రామ మందిర అంశం, 370 అధికరణం విషయంలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమన్న మంగళవారంనాటి తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అసలు రామమందిర అంశంపై అప్పుడు నన్నెవరూ ప్రశ్నించలేదని షా అన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చట్టం చేసేందుకు రాజ్యసభలో తమ పార్టీకి తగినంత బలంలేదంటూ మే 10న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సాధువులు మండిపడ్డ సంగతి తెలిసిందే.. మీ హయాంలో అవినీతికి మీదే బాధ్యత్ణ మన్మోహన్సింగ్పై అమిత్షా విమర్శ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి తానొక్కరూ సరీగ్గా ఉంటే చాలదని, తన హయాంలో వ్యవస్థలో జరిగిన అవినీతికి కూడా బాధ్యత వహించాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను ఉద్దేశిస్తూ అమిత్షా అన్నారు. మన్మోహన్ నేతృత్వంలో జరిగిన కుంభకోణాల విలువ రూ. 12 లక్షల కోట్లు, కాంగ్రెస్ ఆ బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటుందని అమిత్ షా ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అవినీతి గురించి పదేపదే ప్రస్తావిస్తుందంటూ మన్మోహన్సింగ్ చేసిన విమర్శలపై అమిత్షా బదులిచ్చారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more