ys jagan | chandrababu | ap | promises

Ys jaganmohan reddy attacked on chandrababu naidu

ys jagan, chandrababu, ap, promises

Ys jaganmohan reddy attacked on chandrababu naidu. jagan said that if chandrababu will come without any security people will attack by stones.

రాళ్లతో కొడితే చంద్రబాబే కాదు జగన్ కూడా జనాల్లోకి రారు

Posted: 05/18/2015 04:30 PM IST
Ys jaganmohan reddy attacked on chandrababu naidu

నారా చంద్రబాబు నాయుడు గురించి ఉదయం లేచింది మొదలు హనుమాన్ చాలీసాలా.. తిట్ల దండకాన్ని చదివే వైయస్ జగన్ మళ్లీ అదే పని చేశారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు సెక్యురిటీ లేకుండా జనాల్లోకి రాగలడా...? వస్తే మాత్రం జనాలు ఊరుకుంటారా..? రాళ్లతో కొడతారు అంటూ అబ్బో సభలో హిట్ సినిమా డైలాగుల్లా డైలాగులు కొట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏపి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అన్నీ అబద్దాలే చెబుతున్నారని మండుపుడుతున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి.

ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో విఫలమైన చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ుణమాఫీ చేస్తామని చెప్పారని కానీ ఇంత వరకు చెయ్యనే లేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఆనందంగా ఉన్నారంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే జనాలు గనక రాళ్లతో కొడతారు అన్న జగన్ మాటలు గనక నిజమైతే అప్పుడు జగన్ కూడా జనాలకు కనిపించకుండా తిరగాల్సి వస్తుంది మరి. అయినా విమర్శలు చెయ్యాలి కానీ ఏకంగా వ్యక్తిగత విషయాలను మనసులో పెట్టుకొని మరీ తిట్టినట్లు జగన్ మాటలు అనిపిస్తున్నాయి. మరి తీరిక లేకుండా ఫైళ్లతో కుస్తీ పడుతున్న చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  chandrababu  ap  promises  

Other Articles