మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఎంసెట్ పరీక్ష కోసం కోడ్ ఎన్ -1 ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,55,409 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి చెందినవారు 1,70,685 మంది కాగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి చెందినవారు 84,724 మంది ఉన్నారు. రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకున్నవారు 1260 మంది. ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులకు సాయంత్రం 2.30-5.30 గంటల మధ్య జరుగుతుంది. ఈ పరీక్షల నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో 22 రీజినల్ సెంటర్లు, హైదరాబాద్లో 3 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఎవరికివారు సంబంధిత పరీక్ష కేంద్రాలకు గంట ముందు చేరుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎక్కడైనావిద్యార్థులు ఆలస్యంగా వస్తే వారిని అనుమతించే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ఇక.. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలన్నీ తీసుకున్నామని ఏపీ ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వీఎ్సఎస్ కుమార్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల గురించి ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు చెప్పారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష సెట్ కోడ్ ను మంత్రి గంటా, అగ్రికల్చర్-మెడిసిన్ పరీక్ష సెట్ కోడ్ను 10 గంటలకు వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేస్తారని చెప్పారు. ఏపీ ఎంసెట్-2015పై సందేహాల నివృత్తికి విద్యార్థులు, తల్లిదండ్రులు 1804256755 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించవచ్చు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more