అనుబంధాలకు, ఆప్యాయతలకు నెలవు కుటుంబం అయితే అదే రాజకీయ నాయకుల కుటుంబాలు అయితే ప్రేమ కాస్త ఎక్కువే ఉంటుంది. గత కొంత కాలంగా ఆ కుటుంబంలొ విభేదాలు వస్తున్నాయని పుకార్లు వచ్చినా.. అవి పుకార్లు మాత్రమే నిజాలు కావు అని తేలింది. అవును మేం చెడుతున్నది కేసీఆర్ గారి కుటుంబం గురించి. తెలంగాణ రాష్ట్ర సమితికి మూలస్తంభం కేసీఆర్. ఆయన తర్వాత పార్టీకి వెన్నుదన్నుగా ఉండే మరో మూడు స్తంభాలు.. కేటీఆర్, హరీశ్ రావ్, కవిత. కేసీఆర్ తర్వాత ఎవరంటే మాత్రం.. ఒక్కొక్కరిదీ ఒక్కో సమాధానం. కొంతమంది కేసీఆర్ తనయుడు కేటీఆర్ అని, మరి కొంత మంది మాత్రం పార్టీలో మొదట్నుంచీ ఉన్న హరీశ్రావ్ అన్నది మరికొంతమంది సమాధానం. కవితకు ఏం తక్కువంటూ ప్రశ్నించేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి టీఆర్ఎస్ లో ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు ఉందన్నదని పార్టీలో అందరూ చెప్పే విషయం.
కేటీఆర్, కవిత, హరీశ్రావుల మధ్య దూరం పెరిగిందంటూ కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే.. వీటన్నింటికీ చెక్ పెట్టే కొన్ని ఫొటోలు సాగర్ శిబిరం సాక్షిగా బయటపడ్డాయి. హరీశ్ రావు, కేటీఆర్, కవిత.. ముగ్గురూ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని చాలా సీరియస్ గా చర్చలు జరపడం టీఆర్ఎస్ నేతలనే అవాక్కు పరిచింది. ముగ్గురి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా సీరియస్ టాపిక్ పైనే చర్చ సాగుతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఒకరు సీరియస్ గా మాట్లాడుతుంటే.. మిగిలిన ఇద్దరూ అంతే సీరియస్ గా వింటుండడం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. అసలు అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుకున్నారు... ఏం మాట్లాడుకున్నారన్న దానిపై టీఆర్ఎస్ నేతలూ సీరియస్గానే చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే అటుగా వెళ్లిన ఓ నేత.. ఈ ముగ్గురి కలయికను తన ఫోన్లో బంధించి నెట్లోకి అప్లోడ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫోటోలో ఉన్నట్లు నిజంగావీళ్ల మనసులు కూడా కలిశాయో లేదో మరి..!
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more