విశాఖపట్నంలో జిల్లాలో మైనర్ బాలిక వివాహం కలకలం రేపింది. మైనర్ బాలికల వివాహాలకు అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నాయన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి.. చిన్న చిన్న పట్టణ ప్రాంతాల వరకు అన్ని చోట్ల బాల్య వివాహాలు జరుగుతున్న ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముక్కుపచ్చలారని బాలికలు పెళ్లి కూతుళ్లుగా మారి.. అత్తరిటి ఆరళ్లకు బలవుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.
ఎందరో సంఘసంస్కర్తలు పోరాటాల ఫలితంగా అదృశ్యమైన బాల్యవివాహాలు మళ్లీ విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నాయి. వీటిపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని పెదవాల్తేరు ప్రాంతంలో గురువారం బాల్యవివాహం జరిగింది. మైనర్ బాలికను పెళ్లి పేరుతో అత్యంత చిన్న వయస్సులో మరోకరికి కట్టబెట్టడం ఇష్టలేని స్థానికులు కోందరు ఈ బాల్య వివాహంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచరం అందుకున్న పోలీసులు హుటాహుటిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ తతంగం గురించి తెలుసుకున్న పెళ్లికొడుకు హడావుడిగా మైనర్ బాలికకు తాళికట్టి తన పని కానిచ్చేశాడు. అంతేకాదు.. అప్పటి వరకు ధైర్యంగా ఏం చేస్తారో చేసుకోండంటూ భీష్మించిన పెళ్లికోడుకు పోలీసులు చూసి పరారైయ్యాడు. దాంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులతోపాటు పెళ్లికొడుకు తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Jan 27 | భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం... Read more
Jan 27 | చిన్నారులకు సంబంధించి నేరుగా శరీరానికి శరీరం తాకితేనే అది పోస్కో చట్టం కింద లైంగిక వేధింపుల కేసుగా పరిగణించ బడుతుందని బాంబే హైకోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే... Read more
Jan 27 | జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన... Read more
Jan 27 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం... Read more
Jan 27 | ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్... Read more