మొబైల్ వినియోగదార్లకు శుభవార్త! ఇకనుంచి జాతీయ రోమింగ్ కాల్స్, టెక్ట్స్ మెసేజెస్ ఛార్జీలు మరింత చౌక కానున్నట్లు సమాచారం! ఈ మేరకు వాటిపై సీలింగ్ టారిఫ్ లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తగ్గించింది. అంతేకాదు.. ప్రత్యేక రోమింగ్ టారిఫ్ ప్లాన్ ను ఆఫర్ చేయబోతున్నట్లు ట్రాయ్ తెలిపింది.
ఈ క్రమంలో ట్రాయ్ తగ్గించిన సీలింగ్ టారిఫ్ వివరాలను గమనిస్తే.. ఇక నుంచి ఔట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిముషానికి రూ.1 నుంచి 80 పైసలు.. ఎస్.టీ.డీ కాల్స్ కు నిముషానికి రూ.1.50 నుంచి 1.15కు తగ్గించింది. ఇక రోమింగ్ విషయంలో ఇన్ కమింగ్ కాల్స్ కు నిముషానికి 75 పైసలు నుంచి 45 పైసలు తగ్గించినట్లు తెలిపింది. అలాగే లోకల్ ఎస్ఎంఎస్ లకు రూ.1 నుంచి 25 పైసలు, ఎస్.టీ.డీ ఎస్ఎంఎస్ పంపితే రూ.1.50 నుంచి 38 పైసలుకు ఛార్జీలు తగ్గించినట్లు ట్రాయ్ విశ్లేషించింది. ఈ విధంగా తగ్గించిన టారిఫ్ వివరాలను ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘వినియోగదారులంతా తగ్గించిన సీలింగ్ ఛార్జీల ద్వారా ప్రయోజనం పొందుతారు’ అంటూ ట్రాయ్ ఆ ప్రకటనలో భాగంగా స్పష్టం చేసింది. ఈ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మొత్తం వివరాలను పరిశీలిస్తే.. కొత్త ఛార్జీలతో కాల్ ఛార్జీలు 20 శాతం, మెసేజింగ్ రేట్లు 75 శాతం మేర పడిపోయాయి. వినియోగదారుల ప్రయోజనం కోసం నష్టాన్ని భరించేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి. మరోవైపు.. ఛార్జీలు ఒకేసారి ఇంత చౌకగా తగ్గిపోవడంతో వినియోగదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more