మోదీ సర్కారు పట్టుబట్టి తీసుకొస్తున్న భూసేకరణ బిల్లు ఒక మెట్టు దాటింది. విపక్షాలను సంతృప్తి పరిచే ప్రయత్నంలో భాగంగా రైతులకు, నిర్వాసితులకు అనుకూలంగా 9 సవరణలను ప్రభుత్వమే చేసింది. విపక్షాలు చేసిన సవరణలు మాత్రం ఓటింగ్లో వీగిపోయాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ బిల్లుకు రాజ్యసభలో మాత్రం గండం పొంచి ఉంది. సొంతంగా బిల్లును గెలిపించుకునేంత బలం లేకపోవడంతో... ఇతర పక్షాల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న లోక్సభలో భూసేకరణ సవరణ బిల్లు అనుకున్నట్లుగానే గట్టెక్కింది. ఓటింగ్ సందర్భంగా ఎన్డీయే పక్షాలుసహా మరిన్ని పార్టీల మద్దతు కోసం ప్రభుత్వం మెట్టు దిగివచ్చింది. ప్రతిపక్షాల సవరణల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని 9 సవరణలను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఓటింగ్ సందర్భంగా బీజేడీ వాకౌట్ చేసింది. అకాలీదళ్, శివసేన, టీడీపీవంటి మిత్ర పక్షాలు వ్యతిరేకించకపోవడంతో ప్రభుత్వ పరువుదక్కింది. టీఆర్ఎస్ కూడా బిల్లుకు మద్దతు పలికింది.
లోక్సభలో మెజారిటీ ఉండడంతో బిల్లును ప్రభుత్వం నెగ్గించుకుంది. అయితే ఒక్క బీజేపీకే కాదు, మొత్తం ఎన్డీయేకే రాజ్యసభలో మెజారిటీ లేదు. ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండడమే కాక, ఐక్యంగా ఉండడంతో బిల్లుకు అసలు పరీక్ష రాజ్యసభలోనే ఎదురుకానుంది. యూపీఏలోనూ, ఎన్డీయేలోనూ లేని విపక్ష పార్టీల మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజ్యసభలో కూడా బిల్లును ఈ వారంలోనే ఆమోదింపచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్సభలో టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినందున రాజ్యసభలోనూ మద్దతు పలుకుతాయని భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ తదితర పార్టీలను ఒప్పించే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలా గనక జరిగితే మోదీ సర్కార్ భూసేకరణ బిల్లును విజయవంతంగా చట్టంగా మార్చే అవకాశం కలుగుతుంది. లేని పక్షంలో బిల్లు అట్టకెక్కుతుందని అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more