మగాళ్లతో ఎంత గోడవపడినా కేవలం మాటల వరకే కానీ ఎప్పుడూ చేతల వరకు తెచ్చుకోరు మహిళలు. అలాంటిది తనతో గొడవకు దిగిన ఓ వ్యక్తిని ఎంతో సాహసంతో ఎదుర్కొందీ మహిళ. అతడి చెంపలు వాయించమే కాదు.. ఎత్తి కుదేసి.. తనకు కుస్తీ పోటీలలోనూ ప్రవేశముందని నిరూపించుకుంది. మహారాష్ట్రంలోని ముంబై ప్రాంతంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పోకిరీలను ఎదుర్కొనేందుకు ఈ మహిళ బుద్ధిచెప్పిన తీరును చూసి మిగతా మహిళలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. తనతో గొడవ పడిప దుండగుడి రెండు కాళ్లు ఎత్తి నేలకు కుదేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రయాణం నిమిత్తం సదరు మహిళ రైల్వే స్టేషన్కు వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చిన ఓ దుండగుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ అతడి చెంపలు వాయించింది.
మహిళ సాహసం చూస్తే డబ్ల్యూడబ్ల్యూఈ గుర్తుకు వచ్చేలా ఉందని పలువురు ప్రతిస్పందించారు. రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పెట్టాడు. కాగా, ఈ వీడియోను వీక్షించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ వ్యక్తి ఆమెతో ఎందుకు గొడవ పెట్టుకున్నాడో తెలియదు. ఏదేమైనా దుండగుడికి బుద్ధి చెప్పిన మహిళదే విజయంగా చెప్పవచ్చు. అయితే అమె మహిళ కాదని, హిజ్రా అని కూడా వార్తలు అందుతున్నాయి. హిజ్రాలు మాత్రమే తమ పరిసరాలను పట్టించుకోకుండా తమతో గొడవ దిగిన వ్యక్తులను దుమ్మురేపుతారని, మహిళలు అంతటి సాహసం చేయరని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఏదీ ఏమైనా పోకిరీలకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటున్నాయి మహిళా సంఘాలు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more