డ్రగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిన ప్రతి సారి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరి పేర్లు బయటికి రావడం తర్వాత ఆ ఊసు లేకుండా పోవడం మామూలే. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ఓ సినీ దర్శకుడు, నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజలు క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువ నిర్మాత సుశాంత్ రెడ్డి, దర్శకుడు రవికుమార్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి నైజీరియా దేశానికి చెందిన సుల్తాన్, శ్యాంసన్ ఏ బూపా, ఉజర్ ప్రామిస, అటూబఖ్ బోషాను అరెస్టు చేశారు. వారి నుంచి వారి వద్ద నుంచి 90 గ్రాముల కొకైన్, తొమ్మిది ప్యాకెట్ల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రెండు వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.
కొంత కాలంగా నైజీరియా దేశస్థుల వద్ద మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ సినీ పరిశ్రమలోని పలువురికి అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు విక్టర్, ప్యాక్రిక్ పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని సైతం అరెస్టు చేస్తామని చెప్పారు. చదువు ముసుగులో నగరంలో నివసిస్తున్న నైజీరియన్లు.. ముంబాయి, గోవ వంటి ప్రదేశాల నుంచి మాదకద్రవ్యాలను నగరానికి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సమావేశంలో ఏసిపి ఉదయ్కుమార్రెడ్డి, ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి పాల్గొన్నారు. మొత్తానికి సినిమా పరిశ్రమకు చెందిన వారు ఇలా డ్రగ్ మాఫియాలో ఓ భాగంగా ఉండటం సినిమా ప్రపంచానికి చెడ్డపేరు తెస్తోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more