సుడిగాలి పర్యటనలు మొదలు పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం రోజు పాలమూరులో పర్యటించారు. నగరంలోని మురికివాడలకు వెళ్ళి ప్రజలను కలుసుకున్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. పొద్దుపోయే వరకు పాలమూరులోనే గడిపి రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. మహబూబ్ నగర్ కు ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గం గురించి కేసీఆర్ పట్టించుకుంది చాలా తక్కువ. కాని ఇప్పుడు సడన్ గా జిల్లాపై ప్రేమ పుట్టుకురావటంపై ఆనందం, ఆశ్చర్యం, సందేహం వ్యక్తం అవుతున్నాయి.
జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి రెండ్రోజుల క్రితం తెలంగాణ సీఎంపై విమర్శలు చేశారు. పాలమూరును కనీసం పట్టించుకోవటం లేదని విమర్శించారు. గతంలో గెలిపించిన విశ్వాసం కూడా చూపించటం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం చేసిన పర్యటన ఆయన సొంత నిర్ణయంతో చేపట్టారా.. లేక నాగం విమర్శల నేపథ్యంలో ఆయనకు సమాధానం చెప్పేందుకు పర్యటించారా అనేది తెలియదు. అందుకే ఇద్దర్లో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో జిల్లా ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. క్రెడిట్ ఎవరికి వెళ్లినా జనాల బ్రతుకులు మారేందుకు జనవరి 18 ఉపయోగపడింది అని చెప్పవచ్చు.
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్, బస్తీవాసుల బ్రతుకులు మారాలని ఆకాంక్షించారు. వారం రోజుల్లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇండ్ల నిర్మాణంకు పునాదిరాయి పడుతుందని చెప్పారు. నాలుగున్నర నెలల్లో ఇండ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని హామి ఇచ్చారు. నాలుగేళ్ళలో పట్టణంలోని మురికివాడలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దొరికి, ప్రజల జీవితాల్లో పేదరికం తొలగినపుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు అని కేసీఆర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more