ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ ఎన్నికల్లో అజేయంగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. 49 రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పీఎం పదవి కోసం ఆశపడి మోడీని ఢీకొట్టాలనే ప్లాన్ రచ్చరచ్చ చేసేశారు. అంతే! ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ భారీ ఓట్లతో గెలుపొందిన అనంతరం కేజ్రీవాల్ అడ్రస్ లేకుండా పోయారు. తాను ఎంతో కష్టపడి సాధించిన ఇమేజ్ ఒక్కసారిగా మట్టిలో కొట్టుకుపోయింది. ఎన్నిప్రయత్నాలు చేసినా.. ప్రజల నుంచి అంతగా ఆదరణ దక్కలేదు. దీంతో ఆయన మీడియా ముందుకు రాకుండా కొన్నాళ్లపాటు మౌనం పాటించారు.
అయితే ఇంతలోనే ఆయన ఏం చేశారో ఏమో తెలియదు కానీ.. మళ్లీ అతని స్టార్ ఇమేజ్ ఢిల్లీలో వెలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమను కేజ్రీవాల్ మోసం చేసి నిండా ముంచారని పెదవి విరిచిన ఢిల్లీ ప్రజలు.. ఇప్పుడు ఆయనను ఢిల్లీ పీఠాధిపతిగా మరోసారి చూడాలని ఆశపడుతున్నారట! ఇది వినడానికి చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ వున్నా.. ఇది మాత్రం నిజం! ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే సరైన వ్యక్తి అంటూ అత్యధిక ఓటర్లు భావిస్తున్నారని సమాచారం! దీంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కేజ్రీ ‘క్రేజీ’గా గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చర్చలు కొనసాగిస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికలపై ఓ ఛానెల్ తాజాగా ఒపీనియన్ పోల్’ను నిర్వహించింది. అందులో ఆ ఛానెల్ మొత్తం 6,414 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించగా.. అందులో దాదాపు 54 శాతం మంది ఓటర్లు కేజ్రీవాల్ సీఎం అయితేనే అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేత-కేంద్రమంత్రి హర్షవర్ధన్’కు 29 శాతం, ఆ పార్టీ మరో నేత జగదీష్ ముఖికి 3 శాతం, కాంగ్రెస్ నేత-ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్’కు 5 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. ఈ పోల్ విషయాన్ని కాస్త పక్కనపెడితే... ఢిల్లీ ప్రజలు చాలావరకు కేజ్రీవాల్’నే సీఎంగా మరోసారి చూడాలని కోరుతున్నారని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. మరి.. ఎన్నికల తర్వాత పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more