ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా జరిగే కోడి పందాలపై ఉత్కంఠ వీడటం లేదు. పందాలపై విచారణను సుప్రీంకోర్టు సోమవారంకు వాయిదా వేసింది. దీంతో పందాలు ఉంటాయా.., ఉండవా అని పందెం రాయుళ్ళు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏటా సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు జరగటం ఆనవాయితీగా వస్తోంది. లక్షల రూపాయలు చేతులు మారే ఈ పందాలు కేవలం సంక్రాంతి సమయంలోనే జరుగటం విశేషం. ఇందుకోసం రాష్ర్టం నలుమూలల నుంచి పందెంరాయుళ్లు కోనసీమకు తరలివస్తారు.
అయితే కొద్దికాలంగా పోలిసులు, ప్రభుత్వం కోడి పందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పందెంను జూదంగా, జీవహింసగా పరిగణిస్తూ ప్రభుత్వం నిషేధించటంతో పోలిసులు చర్యలు చేపడుతున్నారు. పందెం కోళ్ళు కన్పిస్తే స్వాధీనం చేసుకోవటంతో పాటు, నిర్వాహకులపై కేసులు పెడుతున్నారు. దీనిపై కోనసీమ వాసుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కేవలం పండగ సమయంలో సంతోషంగా జరుపుకునే ఈ పందాలు సాంప్రదాయంగా వస్తున్నాయనీ.. వాటిని అడ్డుకోవద్దని కోరుతున్నారు. ఇదే అంశంపై పందాలను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎంపీ మురళీ మోహన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
మరోవైపు జంతు ప్రేమికులు ఈ పందాలను వ్యతిరేకిస్తున్నారు. వినోదం పేరుతో కోళ్ళను హింసించి చంపేసే ఆటలను ప్రోత్సహించవద్దని కోరుతున్నారు. ఇలా భిన్న వాదనల నేపథ్యంలో కేసు విచారణ వాయిదా పడటంతో చివరి నిమిషంలో అయినా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందా రాదా అని పందెం రాయుళ్ళు ఎదురుచూస్తున్నారు. అటు వేల రూపాయలు ఖర్చుపెట్టి పందాల కోసం కోళ్లను పెంచిన వారయితే కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తమకు లక్షల రూపాయల నష్టం వస్తుందని ఇప్పటినుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more